కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

4, జులై 2015, శనివారం

"వెళ్ళ వల్సిన వాళ్ళ ఇళ్ళ కి తరుచుగా వెళ్ళు...నడవని దారిలో పల్లేళ్ళు మొలిచేస్తాయి"


"వెళ్ళ వల్సిన వాళ్ళ ఇళ్ళ కి తరుచుగా వెళ్ళు.నడవని దారిలో పల్లేళ్ళు మొలిచేస్తాయి"-

ఇది"గెలుపుసరే..బతకడంఎలాగ"అన్నతనపుస్తకంలో,నేటిఈఆధునికరచనాకాలంలో,తనకెవ్వరూ,'ఏనాటికీసాటిరాలేని'...తెలుగుతెలిసినవాళ్ళుమావాడని(మాకళింగుడేననీ)గర్వించితీరవలసిన,స్వర్గీయరచయిత'పతంజలి'చెప్పినమాట.

ఈమాటప్రకారమే,ఈకళింగకేకబ్లాగులోనిపోష్టులు...'గతకాలంనాటిముచ్చట్లేకదాఇవి'అనుకున్నవాళ్ళకీ..ఇదంతా'నాస్టాల్జియా'అనుకునేవాళ్ళకీశతాధికదివ్యవందనాలు." 

"ఒకవేళభగవంతుడుకానీఈలోకంలోకాపురంవుంటేఆయనఇంట్లోఖచ్చితంగాదొంగలుపడిపోయేవారు".అనిఈనాటిరాజకీయనాయకులకిపూర్తిగారూపుకట్టగలిగిన,కళింగజాతిరత్నం,'రచనామేరునగం'స్వర్గీయకె.ఎన్.వై.పతంజలిగారికి  స్మ్రుత్యాభివందనం చేస్తూ, బ్లాగు నేటి పోష్టు లోకి అడుగు పెడితే ...







క్రీ..శ.7వ శతాబ్దం లో హర్షవర్ధన చక్రవర్తి దక్షిణ హిందూ దేశమంతటినీ జయించాలని బయల్దేరేడు.అయితే అతణ్ణి నర్మదా నదీతీరంలో చాళుక్య వంశపు రాజైన సత్యాశ్రయ పులకేశి ఓడించి వెనక్కి పంపేడు.అదేసమయంలో అతడు వేంగినీ (ప్రస్తుతఆంధ్రప్రదేశ్ నీ,కళింగాన్నీ జయించి వాటికి తన తమ్ముడు కుబ్జ విష్ణు వర్ధనుణ్ణి రాజుగా పట్టం కట్టేడు. క్రీ.శ. 615 నుండి ఈ  కుబ్జ విష్ణు వర్ధనుడు ఈ రాజ్యాలకి స్వతంత్ర పాలకుడై పూర్వ చాళుక్య వంశ స్థాపకుడన్న పేరు చరిత్రలో నిలబెట్టుకున్నాడు.ఇతను రూపంలో పొట్టివాడైనా పరాక్రమంలో చాలా గట్టివాడవ్వడం వల్ల "విషమసిధ్ధి " అన్న బిరుదుపొందేడు. ఎలమంచిలి దగ్గరున్న తిమ్మాపురంలో దొరికినశాసనంలో జలదుర్గమైనా,స్థల దుర్గమైనా ఎంత బలమైన దుర్గాన్నైనా సాధించి తీరాలన్న పట్టుదలకల రాజు కనుకే ఇతడి "విషమసిధ్ధి " పేరు సార్ధకమయ్యిందని రాసి ఉందిఇతడు తను రాజ్యానికి వచ్చిన 18 వ సంవత్సరం లో 'కలవలపల్లి' అనే గ్రామాన్నిమాధవ శర్మ,విష్ణు శర్మ అనే బ్రాహ్మణులకి దానం చేసిన శాసనం ఉంది.. ఎలమంచిలికి 3 మైళ్ళ దూరంలో ఉన్న 'దిమిలి' కి ఈ గ్రామం మైలు దూరంలో ఉంది.పూర్వం దిమిలి కళింగుల నౌకాధికారానికి గొప్ప పేరున్న గ్రామంగా నిలిచిఉండేది.ఇక్కడ ఉండే దీప స్థంభాలు సముద్రంలోని నౌకలకి దిశా నిర్దేశనం చేసేవి.దిమిలి పక్కనే ఉన్న తెరువుపల్లె గ్రామంలో ఉన్నరత్నాకరస్వామి దేవాలయం చాలాకాలంపాటు రత్నప్రభలతో వెలిగిపోతూ ఉండేది.రత్నాకరం అంటే సముద్రం అంటే ఈ దేవాలయం పక్కనే ఉన్న తూర్పుతీర సముద్రదేవుని గౌరవార్థం అప్పటి కాలంలో కట్టినది. వేనవేలుగా ప్రాచీనకాలంనాటి ఇటుకలు అక్కడ చాలా కాలం పాటు ఉన్నాయి. సముద్రంమీది ఓడలకి దారి చూపించే దివ్వెలు లేదా దీపాలు ప్రతిష్టించిన చోటు కనుకనే అది కాలక్రమంలో దిమిలి దివిలి అయ్యింది.కుబ్జ విష్ణు వర్ధనుడు తన సోదరుడు రెండవ పులకేశి తరఫున  క్రీ.శ.641 లో పల్లవ రాజు ఒకటవ నరసింహ వర్మ తో పోరాడి మరణించేడని చరిత్ర చెపుతుంది.కుబ్జ విష్ణు వర్ధను డి తర్వాత అతని కుమారుడు జయసింహుడు రాజయ్యేదు. అతను అన్ని కార్యాలూ సాధించగలిగేడని అతని పేరు సర్వసిధ్ధి అయ్యింది.అతడు తనపేరు మీద సర్వసిధ్ధి పట్టణాన్ని కట్టించేడు. సర్వసిధ్ధి పట్టణం సరసులకి చాలాప్రసిధ్ధి చెందినదిగా ఉండేది. నెల్లూరు నెరజాణల ఆటలేవీ ఈసర్వసిధ్ధి  సరసుల ముందు సాగేవి కావన్నమాట నానుడిలో మిగిలిపోయింది.ఈ నాటికీ ఆ పేరు సర్వసిధ్ధి తాలూకా రూపంలో నిలబడి ఉంది.ఈ రాజు శాసనాలెన్నో ఈ ప్రాంతాల్లో దొరికేయి. ఈ రాజు తర్వాత రాజ్యం ఏలిన రాజులెందరో ఈ బిరుదు నే ధరించేరు.

ఈ జయసింహ సర్వసిధ్ధి గురించి క్రీ.శ.7 వ శతాబ్ద కాలంనాటి దండి మహాకవి తన కావ్యాల్లో వర్ణించేడు. కళింగదేశపు వసంతోత్సవ వివరాలను,కళింగుల నౌకా సమర కౌశలాన్ని,వారి ప్రచండ నౌకా బలాన్ని ఆ మహాకవి ఎంతో అందంగా వర్ణించేడు.ఇతనికాలంలోనే యువానీ చాంగ్ అనే చైనా దేశస్థుడు ఈ ప్రాంతాన్ని సందర్శించేడు. రెండవ విష్ణు వర్ధనుడు,ముంగి యువరాజు అతని కుమారుడు కొక్కిలి విక్రమాదిత్య భట్టారకుడు 709 వరకూ ఈ ప్రాంతాన్నేలిన తర్వాతరాజులు..వీరికి సంబంధించిన శాసనాలు విజయనగరంజిల్లాలో ఉన్న భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామం లో దొరికితే మహాకవి గురజాడ అప్పారావు గారు వాటిని పరిశోధకులకి పంపేరు. ఈ శాసనాల్లో వీరి రాజధాని ఎలమంచిలి అని రాసి ఉంది.కొక్కిలి రాజు తనపేరుతో ఒక ఊరును కట్టించి ఉంటాడని అనుకోవడానికి నిదర్శనంగా ఎలమంచిలి కి మైలు దూరంలో కొక్కిరాపల్లిఅన్నగ్రామంఉంటుంది.రెండవవిష్ణు వర్ధనుడి నాణేలు  కూడా1895 లో ఎలమంచిలి కొండమీద దొరికేయి.

మొదటి చాళుక్య భీమ విష్ణు వర్ధనుడి దాన శాసనం ఒకటి ఎలమంచిలి కి 12 మైళ్ళ దూరంలో ఉన్న కశింకోట లో (1909లో)దొరికింది. దీనిలోఈ రాజు రాజ్యంలో 'యలమంచి కళింగం' తోపాటు 'దేవరాష్ట్రం' కూడా (ప్రస్తుతం శ్రుంగవరపుకోట ప్రాంతం) భాగంగాఉన్నట్టు ఈ శాసనం తెలియజే స్తుంది.ఇదే దేవరాష్ట్రం పేరు గురించి అలహాబాదులో ఉన్న సముద్రగుప్తుడి (ఉత్కళ సీమ వాసులనుభయకంపితులనుచేసినరక్తబాహుడు(!)) శాసనంలోకనబడుతుంది.
నర్శీపట్టణంకలెక్టరుఆఫీసులో"కళింగభానుడు"గిడుగురామ్మూర్తిపంతులుగారు కళ్ళారా చూసిన ఎలమంచిలి ప్రశంస ఉన్న శాసనం తర్వాత ఏమైపోయిందన్నది ఎవరికీ తెలీని విషయమైపోయింది. ఏ చెత్త మరుగున పడిపోయిందో ఎవరి ఇంటి పునాదుల్లోనో మరుగు దొడ్డి లో మసిమరకలు పూసుకుని రూపుమాసిపోయిందో ఎవరికీ పట్టలేదు. భవభూతి మహాకవి రచించిన 'మాలతీ మాధవం' కావ్యంలోని భరత వాక్య శ్లోకం   కశింకోట శాసనంలోని ధ్యాన శ్లోకాలలో రాయబడింది.ఇది 'ఎలమంచిలి'  కళింగ రాజ్యంలోఒకరాజధానిగాచాలాకాలంకిందఉండేదన్నసంగతి(త్రికళింగాలలోఒకటైన'మధ్యకళింగ'కి..దీనినే'మెగస్తనీసు'(302B.C.లో)తనయాత్రావివరాలనుతెలిపినపుడుపేర్కొన్న'మోడెగాలింగ'అనికూడాచెప్పవచ్చు.) మనకి మౌనంగానే చెపుతుంది.

అలా చాలాకాలం అంటే క్రీ.శ.10 వ శతాబ్దంవరకూ ఉచ్ఛ స్థాయిలోనే మధ్యకళింగ కి రాజధానిగా వెలుగులీనిన ఎలమంచిలి ప్రాధాన్యత క్రీ.శ 920 నుంచి తగ్గిపోవడం మొదలైందనే చెప్పాలి.దానికి కారణం ఆ కాలంలో ఈ ప్రాంతానికి రాజైన 'అమ్మ రాజ విష్ణు వర్ధనుడు' రాజమహేంద్రవరాన్ని నిర్మించి దాన్ని ఆంధ్ర రాజ్యానికి రాజధానిగా చేయటమే ప్రధానకారణం అనటంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. అంతకు ముందు కొద్ది కాలంపాటు తూర్పు చాళుక్యుల ఏలుబడిలో కూడా ఎలమంచిలి  ఉన్న సంగతి ఏడవ విజయాదిత్యుడి పేరుతో  ఎలమంచిలి లో దొరికిన,క్రీ.శ.1063 ,ఇంకా 1075 మధ్య కాలంనాటి  శాసనాలు చెపుతాయి.అమ్మ రాజ విష్ణు వర్ధనుడు' 'రాజమహేంద్రు'డన్న బిరుదు మొదటగా ధరించేడన్న సంగతి కూడా,సాక్ష్యాలు గా ఉన్న శాసనాలు చాటి చెపుతాయి. ఆ రాజు అతని వంశస్థులు క్రీ.శ.1118 వరకు ఈ ప్రాంతాన్ని ఏలేరు.ఆ తర్వాత రాజ్యంలోకి వచ్చిన విక్రమచోడుడు తను చోడ సామ్రాజ్య పరిపాలనకి ఆ ప్రాంతానికి వెళ్ళిపోతూ తన ప్రతినిధిగా ఈ ప్రాంతాన్ని ఏలడానికి కులోత్తుంగ రాజేంద్ర చోడుడిని నియమించేడు.ఇతడి మంత్రి పేరు కొమ్మన. వీరిద్దరి పాలనా సమయంలో ఈ ప్రాంతం ఎంతో సుభిక్షంగా వర్ధిల్లింది.ఆ విషయాన్ని మంచన కవి తన కేయూరబాహు చరిత్రలో  చాలా అందంగా చెప్పేడు.



గీ! మంటి కడవ నులక మంచంబు 
    పూరిల్లు నూలిచీర రత్నకీలి
    తంబు గాని పైడితొడవు గలుగుటె
    రుంగరు ....పురము లోని జనములెల్ల.


.....గళింగ రాష్ట్రంబులో ని ఎలమంచిలాదిగా నెలమి ముప్పది రెండు విష్ణు ప్రతిష్టలు వెలయజేసి..


కొమ్మనమంత్రి,ఎలమంచిలిలోనిర్మించినతటాకం...నేటికీ'కొమ్మాయగుండమ'న్నపేరుతోనేఉంది.నేటికి900ఏళ్ళకిందటిదనిచెప్పే,ఒకప్రాచీనమంటపంఆనవాళ్ళుకూడాకనబడతాయి.ఇంకాఆకొమ్మనమంత్రిప్రతిష్టించినవైష్ణవాలయం,శిధిలరూపంలోనే,ఐనారెండువందలఏళ్ళకిందట'కోడుగంటిగోపాలరావు'అనే,ఆయనదానినిఉధ్ధరించటంవల్ల,నిలబడేఉంది.నాడుమంచనకవివర్ణించినమహావైభవమంతాఎలమంచిలిలోనేడునాశనమైపోయింది.దగ్ధపటలమైపోయింది.





ఎలమంచిలికిఅయిదుమైళ్ళదూరంలోపంచదార్లక్షేత్రముంది.అక్కడధారలింగస్వామిప్రతిష్టితమైఉన్నాడు.అక్కడకూడాశాసనాలుచాలానేఉన్నాయి.సంవత్సరాల తరబడి పక్కనే జరుగుతున్న ఇనుపఖనిజం తవ్వకాలు ఈ దేవాలయం ముందుకాలం ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. 


సున్నపు పూతలతో శూన్యమైపోతున్న శాసనాలు 




కళింగరాజ్యపుగతకాలపుఅద్భుతమైనచరిత్రనుచెప్పగలిగేఅనేకానేకశాసనాలుగుడికివేస్తున్నవెల్లమాటునా,పగుళ్ళకుపూసిపారేస్తున్నసిమెంటుపూతలవెనుకామాసిపోయి,మగ్గిపోయిరూపురేఖలుమాసిపోయినవిఎప్పుడోపోయేయి.


 నేలలోకూరుకుపోయిన చారిత్రక శిల్పాలతో చేరిపోతున్న శిల్పం


మిగిలినవి కూడా అంతరించిపోయే కాలం ఇప్పుడు సాగుతోంది.ఈదేవాలయం సింహాచల క్షేత్రం అంత పురాతనమైనది అని చెప్పవచ్చు. 'కావ్యాలంకార చూడామణి' విన్నకోట పెద్దన కాలనిర్ణయానికి ఇక్కడున్న చాళుక్య విభుని శాసనం  ఆధారమైంది.



"కళింగదేశవిజిగీషామనిషందండెత్తి"...వస్తున్నక్రిష్ణదేవరాయలు(ఇది'ఆముక్తమాల్యద'లోఆయనరాసుకున్నమాటే)సర్వసిధ్ధిసమీపంలోఒకచోటకొంతకాలంమకాంవేసేడు.అక్కడేగొప్పదనాన్నిచూసేడోగానీ,ఆయనఅక్కడ,ఒకపట్టణాన్నినిర్మించి,దానికి'శ్రీక్రిష్ణదేవరాయవరం'నిపేరుపెట్టేడు.అతనునల్లరాతిబండమీదరాయించినఆపేరున్నశాసనంఆఊరిబయటసంతదగ్గరచాలాకాలంపడిఉండేది.దాన్నిఅక్కడిజనం'రాచబండ'అనిపిలిచేవారు.కాలక్రమంలోదానిపేరులోమిగిలినవన్నీ పోయి రాయవరం మాత్రమే నేటికి మిగిలింది.ఇది ఎలమంచిలి కి 6 మైళ్ళదూరంలో ఉంది.





విజయనగరసామ్రాజ్యం తళ్ళికోట యుధ్ధంలో అంతమైపోయేక ఎలమంచిలి హైదరాబాదు ముస్లిం నవాబుల చేతుల్లో పడింది. వాళ్ళకి లోబడిన పూసపాటి రాజులు వారి దగ్గరనుంచి ఎలమంచిలిని పొంది తమ పాలన సాగించాలని భావించేరు. కానీ ఎలమంచిలి కోట వాళ్ళకి అంతతేలిగ్గా లోబడలేదు.కనుక దానిని ధ్వంసం చేసి మరీ ఆ రాజులుఎలమంచిలిని తమ పాలనలోకి తెచ్చుకున్నారు.ఆ విషయాన్ని సగర్వంగా పూసపాటి వారు తమ బిరుదుల్లో చేర్చుకున్నారు. 


బిరుదు1."నెల్లూరు,యెలమంచిలి,కంచి,దేవగిరిచూరకారులు".

(ఈనాలుగుపట్టణాలునాలుగురాజధానులుగాఉండేవి.నెల్లూరుమనుమసిధ్ధిది.ఎలమంచిలి మధ్యకళింగాధిపుడిది.కంచి చోళ రాజుది.దేవగిరి యాదవ రాజులది.)

బిరుదు2."కంచీ,చెంజీ,లమంచిలి,నెల్లూరు,ద్వారకాపురి,నిర్ధూమధాములు.

       





ఇంతకాలం తర్వాత అయినా సరే అలనాటి మధ్యమ కళింగ సొబగులను మరొక్కసారి తీర్చిదిద్దాలనుకునే వారు ఎవరైనా సరే నేటి కళింగులలో అందుకు నడుంకడితే ఎన్నైనా చారిత్రక ఆధారాలని అందించేదుకు ఎలమంచిలి ఎర్రమట్టి అంతా అందుకు సిధ్ధంగానే ఉంది.

మొట్టమొదటి తెలుగు యాత్రా చరిత్రకారుడు కళింగ బంధువు అయిన శ్రీ యేనుగుల వీరాస్వామయ్యగారు పైప్రాంత విశేషాలు ..













 (గతించిపోయినా గుర్తు తెచ్చుకోవలసిన విశాఖగతచరిత్ర తదుపరిపోష్టులో..)
-------------------------------------------------------------------------------------------------------------
*ఎలమంచిలిని ఒకప్పుడు 'ఎల్ల-మజిలీ' అని పిలిచేవారన్న సంగతి కూడావాడుకలో ఉంది.కళింగకీ ఆంధ్రకీ సరిహద్దు కనుక అలా పిలిచే వారని అంటారు.అందుకే అక్కడ రెండు రాష్ట్రాల మధ్య పన్నులు వసూలు చేసే కేంద్ర ఉండేదని కూడా అంటారు. కానీ అది సరైనది కాదని  అభిప్రాయం .ఎందుకంటే త్రికళింగాలు  గా కొన్ని శతాబ్దాలపాటు విడిఫొయిన కళింగ రాజ్యంలో మధ్య కళింగ రాజధానిగా యెలమంచిలి ఉండేదని గతకాలపు చరిత్ర పరిశోధకుల నిశ్చితాభిప్రాయం. 

*కొత్తూరుదగ్గరఉండే'ధనదిబ్బలు'పురాతనబౌధ్ధమతఅవశేషాలనికలిగిఉన్నాయని,ధారపాలెం,పంచధార్ల,ఎలమంచిలి దగ్గర ఉన్నతూర్పుకనుమల్లో ప్రాచీన చారిత్రక ఆధారాలు లభించేయి అనీ పరిశోధనలు సాగుతున్నాయనీ అంటారు..కానీ అవేమిటి చెప్పేయన్నది మాత్రం చెప్పేవాళ్ళెవ్వరూ లేకపోవడం కళింగుల దౌర్భాగ్యం అనే చెప్పాలి.

*1963-1975 మధ్య పెట్రోలు నిల్వలకోసం ONGC  జరిపిన తవ్వకాల్లో కళింగరాజ్యంలోని  అడవి పాలెంతో పాటు ఎలమంచిలిని కూడా మంచి నిల్వలున్న ప్రాంతంగానే గుర్తించింది.ఇంక మొదలు కావటం లోనే ఆలస్యం జరుగుతోంది.మొదలైతే మెగస్తనీసు చెప్పిన మోడె గలింగ రాజధాని మరి కొద్దిరోజుల్లోనే మోదీ గేస్ రాజధాని అయితీరుతుంది.వద్దనే వారెవరున్నారు కనుక..?

*Reach foundation REPORT ON CONSERVATION OF SRI DHARMALINGESWARA TEMPLE, DHARUPALAM, PANCHADHARA, VISAKHAPATNAM DISR   (Date of visit: 18th February 2011.) www.conserveheritage.org















14, జూన్ 2015, ఆదివారం

"ఇంటినిండా కోళ్ళు ఉన్నాయి గానీ..కూసేందుకు ఒక్కటీ లేదు"




గంజాంజిల్లా1936కుముందు'కళింగసీమ'లోనిది.1929లోఈసీమలో4,5తరగతులుచదువుకున్నవిద్యార్ధులకుమద్రాసుప్రెశిడెన్సీప్రభుత్వం,అందచేసినకొత్త'*సాంఘికశాస్త్రంపుస్తకం'ఈమాటకి,నిలువెత్తుఆధారంగానిలబడుతుంది.

అయితే,'ఇంటినిండాకోళ్ళుఉన్నాయిగానీ,కూసేందుకుఒక్కటీలేదు'అన్నట్టుగా,ఉన్నమనరాజకీయనాయకులందరినీ,ఒక్కొక్కరినీ"నువ్వేంచేస్తున్నావుకళింగులకోసం..అవినీతిదుర్గంధంలో,పీకలలోతుగామునిగిపోయిఉన్న,నక్కలలాంటి,తోడేళ్ళలాంటి..రాజకీయనాయకులకోసం.."ఏరుఏడామడదూరంఉండగానే,చీరవిప్పి,చంకనపెట్టుకుని ఒకామె పోయినట్టు,అమరావతికోసంపరుగెడుతున్నవాళ్ళకోసం,పట్టిసీమకోసం,ఇక్కడిచమురుఎక్కడికోపంపే,చమురు,గేస్దోపిడీకోసం,గనులతవ్వకం,కోసం,వనరులదోపిడీకోసం....నువ్వెందుకు,నీకుమేమిచ్చిన,రాజకీయజీవితాన్నిపణంగాపెడుతున్నావని"కళింగసీమనుండిఒక'కళింగసైన్యం'ప్రభవించి,డగాలన్నదే,ఈరాతలవెనుక,నిండుగానిలబడిపోయిఉన్నఆశ....అదిఎప్పటికైనాఫలిస్తే,సంతోషమే..లేకపోయినా,కొత్తగావచ్చేబాధేంవుండదు.ఎందుకంటేఇన్నివేలయేళ్ళలోనూ,"కాకిగూట్లోనికోకిలబతుకు"లాంటిబానిసబతుకులో,అంతులేని,మాధుర్యాన్ని(!) చవిచూసిన జాతి కదా మనది.


* అప్పటి'సాంఘికశాస్త్రంపుస్తకం' లో కొన్ని పేజీలు









----------------------------------------------------------------------------------------------------------------------------                
       
 ఇంక కిందటి పోష్టుకు అనుబంధంగా ప్రస్తుత పోష్టు లోకి వస్తే...

1789/1792లోవచ్చిపడిన'ఎల్నినో'తుఫానువల్ల,గంజాంజిల్లాలోవచ్చిన,క్షామాన్ని"పుఱ్ఱెలకరువు'అనేవారు.1789లోమొదలైనకరువువరసగా..నాలుగేళ్ళు,వెంటతగిలి,జిల్లానుఇంచుమించు,నిర్మానుష్యంచేసిపారేసింది.విశాఖపట్టణంపరిసరప్రాంతాల్లో1792ఏప్రిలునెలలో1200మందిఆకలిచావుకుగురయ్యేరు.భారతదేశంలోఈస్టిండియాకంపెనీకరువునివారణచర్యలకుపూనుకోవటంఅదేప్రధమం. గంజాంజిల్లాకలెక్టరుగా ఆసమయంలోపనిచేసిన'స్నాడుగ్రాసు'లాంటిఅవినీతిపరులకి,అదేపెద్దపండుగలకాలం.1788/1794మధ్యకాలంలోదేశంలోలక్షాపదివేలమందిపైనేఆకలిచావులకిగురయ్యేరు.దహనంచేసేవాళ్ళులేకఅస్థిపంజరాల,ఎముకలతోనిండిపోయిరోడ్లన్నీ,తెల్లగావెలుగులీనేయని,నాటి బ్రిటిష్ ప్రభుత్వనివేదిక చెపుతుంది.  



గంజాంజిల్లాలో "పుఱ్ఱెల కరువు" చిత్రం


....."స్నాడ్గ్రాస్"ఈస్టిండియాకంపెనీఉద్యోగిగా,గంజాంజిల్లాకలెక్టరుగా,27ఏళ్ళపాటుభారతదేశంలోఉద్యోగం,చేసినవాడయ్యేడు.జీతంతక్కువేఅయినాకల్పవ్రుక్షంలాటికళింగసీమలోఅతనుకలెక్టరుగా,ఓరెండేళ్ళపాటుసంపాదించినది10లక్షల పౌన్లు (ఈనాటిద్రవ్యమానంప్రకారంఅది9కోట్ల78లక్షలపైనేఉంటుంది).అతనిఅనుచరగణం,అతనిఉంపుడుగత్తె,ఇంకాగంజాంజిల్లాలో,అతనిపేరుచెప్పుకునిజమీందార్లుతిన్నదీ,ఎవ్వరిలెక్కలకీదొరకనేలేదు.'స్నాడ్గ్రాస్'సంపదనైతే,ఆర్జించలిగేడు.తీసుకుపోగలిగేడుగానీ,'పరువుప్రతిష్టలు'అన్నవాటినిమాత్రం,అక్కడికితనతో తీసుకువెళ్ళలేకపోయేడు.అతనిమీద,ఆకంపెనీన్యాయవాదులుఆరోపించిన,ఏఒక్కనేరమూఅతని'చదరంగపుటెత్తుల'లాంటియుక్తులవల్ల,తనకిందివాళ్ళమీదకితోసి,తప్పించుకోగలిగినఅద్భుతచాకచక్యంవల్ల,రుజువుకాలెదు.అతన్నిఏరకంగానూలొంగదియ్యలేని,ఈస్టిండియాకంపెనీడైరక్టర్లు,వాళ్ళచేతులోఉన్నచివరిబాణాన్నిసంధించేరు.ఉద్యోగవిరమణచేసినవాళ్ళకి,వాళ్ళుఇచ్చేపెన్షను అతనికి నిరాకరించేరు.


   ఇక్కడ'స్నాడ్గ్రాస్' వేసినఎత్తు...అంతవరకూఎవ్వరికీతెలీనిదీ,ఆతర్వాతకూడాఇంతవరకూఎవ్వరూఎక్కడాఉపయోగించనిదీ,ఇప్పుడుఅవినీతిఆరోపణల్లోజైళ్ళపాలయిపోతున్నమనరాజకీయనాయకులూ,ప్రభుత్వోద్యోగులూ,కూడాచేయగలిగేదీ,అయినమాస్టరుప్లానది..'తనహక్కులకుభంగంకలిగిస్తే,తనకున్యాయంగారావలసిన,పింఛనుఇవ్వకపోతే,మీకూకష్టంకలిగిస్తానని'తనపథకంలో,భాగంగాఅతను,ముందుగాకంపెనీడైరక్టర్లనిహెచ్చరించేడు. వాళ్ళుఅతనిహెచ్చరికని,చీపురుపుల్లనితీసి,అవతలపారేసినట్టుపారేసేరు.కొంతసమయం,అలావాళ్ళకిఇచ్చేక'స్నాడ్గ్రాస్'తనకార్యాచరణలోకి,తిన్నగాదిగిపోయేడు.రెండువందలఏభై ఏళ్ళతరవాతకూడా(అతనుమనమధ్యలేకుండాఏనాడోపోయినాఇన్నిసాంకేతికసౌకర్యాలలోఏఒకటీ,ఆనాడులేకపోయినా)అతన్నిమనఅవినీతిరాబందులు,ఎందుకుగుర్తుపెట్టుకోవాలంటే,తన'సిగ్గు..లజ్జ'అన్నవాటినిఅతడుపక్కనపెట్టిఅవతలవాళ్ళ'సిగ్గులజ్జ,పరువు,ప్రతిష్టల'మీదకొరడాతోకొట్టినంతపనిచేసేడు..




సామాన్యుడికి,ఏఇజంలోఉన్నామోఅర్థంకాని'నిజం'లోకి,భారతీయులందరినీనెట్టేసిన,రాజకీయనాయకులు'గజానికొక్కడు'గాంధారికొడుకు'లా,చెలరేగిపోతున్నపుడు,ఒక'సి.ఎం.'కి400మందిపోలీసులు.రక్షకకవచంగా,ఉండాల్సివచ్చినదౌర్భాగ్యరాష్ట్రంలో,బాగాలోతుగాఅణగదొక్కేసిన,జాతివారసులుగామనమున్నపుడు,మనకేభాదాలేకపోవచ్చుగాక...కానీ,మనం..మననిఘంటువుల్లోంచి,సిగ్గు,లజ్జ,పరువు,ప్రతిష్ట,పదాలని,తీసేసినవాళ్ళంమాత్రంఅవుతున్నాం.నీతివున్నంతకాలందానికి,వ్యతిరేకపదంవుంటుందన్నది..నేడుతప్పవుతోంది.అవినీతే,ఇందుగలదుఅందులేదనలేకుండా,ఎక్కడైనావుంటుంది..ఏదైనానేరారోపణలోఎవరైనాదొంగదొరికితే,మొహానికిగుడ్డకప్పుకునిమనకిమీడియాలోదర్శనమిస్తారు...అదే,మనరాజకీయనాయకులూసెలిబ్రిటీలుఅయితేమాత్రం,మహదానందంతోనవ్వుతూ,దేశోధ్ధారకుల్లా,చిద్విలాసంగాకనిపిస్తారు.ఉపన్యాసాలలోఅవినీతిని,చించిమరీపోగులుపెడతారు.స్త్రీలమీదఅత్యాచారాలుజరిగితే,దేశమంతటాఆందోళనలుఉవ్వెత్తునలేస్తాయి(ఇదిసరైనచర్యే.. తప్పుఎంతమాత్రంకాదు).అవినీతిపరులుగా,రాజకీయనాయకులూసెలిబ్రిటీలుఅడ్డంగాదొరికితే,మాత్రంఅదికుట్రఅని  అతనివర్గం,కులం,రాజకీయపార్టీవాళ్ళు,ఆందోళనలుచేస్తారు.ఆఆందోళనలుచేసేవారినిచెప్పుతోకొట్టేవాళ్ళు,ఎవ్వరూకనబడరు.ఇదిఏమిదేశం?ఇప్పుడు కూడా గొప్పదేశమేనా..?ఒకప్పుడు,ప్రపంచానికిధర్మశాస్త్రాలు,నీతిసూత్రాలుభోదించిన"హిందూదేశం"ఇదుగోఇదీ..అని ఇప్పుడుకూడా తలెత్తి గర్వంగా చెప్పగల దేశమా ?


     అతనేంచేసేడంటే,చిరిగిపోయినబట్టలుకట్టుకుని,స్వీపర్లువీధులుఊడ్చే,చీపురుపట్టుకుని,లీడెనుహాలువీధిలోఉన్నఈస్టిండియాకంపెనీ,విశాలమైనభవనముందునిలబడి,వీధంతాఊడ్చటంమొదలుపెట్టేడు.తానెవరోఇతరులకుతెలీకుండా,ఆపనిచెయ్యాలన్నఉద్దేశ్యంఏదీ,అతనికిలేదుకనుకఆరోడ్డుమీదవచ్చేపోయేవారితో,తానుకంపెనీవారికోసం,భారతదేశంలోచాలాసంపదలున్నజిల్లాకలెక్టరుగా,పనిచేసినవాడిననీ,వారికిందతాను,ఎన్నోసంవత్సరాలుకష్టపడిపనిచేసినాఈపెద్దవయసులో,తనకుతినడానికితిండీ,కట్టుకోవడానికిబట్టకూడా,లేకుండాచేసి,వీధుల్లోముష్టిఎత్తుకుని,బతకమనివదిలేసేరనీ,ఎంతోదీనంగాచిత్రమైనకధలుచెపుతూ,బతకడంమొదలెట్టేడు.లీడెను హాలువీధిపెద్దరాజవీధి.వచ్చీపోయేజనంతో,ఎప్పుడూకిటకిటలాడుతూఉండేది.తూర్పుదేశాలతోవర్తకవాణిజ్యసంపదలను,చాలాభారీగానిర్వహించే'ఈస్టిండియాకంపెనీకార్యాలయం'ఆవీధిలో,చాలాఅట్టహాసంగాఉండేది.ఇండియాలోధనాన్నిఆర్జించివచ్చిన,ఇంగ్లీషువాళ్ళనివాళ్ళదేశంలో,'నవాబు'లనిపిలిచేవారు. ఆనవాబులని,పిలిపించుకునేవాళ్ళు,తాముసంపాదించిన,అపారమైనధనంతోసుఖాల్లోదొర్లుతూ,నీతినియమాలులేకుండాప్రవర్తించడాన్ని,వాళ్ళువిచిత్రంగాచూసేవాళ్ళు..నాటకాలుగారాసివాటిని,ప్రదర్శించేవారు.అయితే,అదేకంపెనీపెద్దఉద్యోగిగా,ఇండియాలోనేపనిచేసివచ్చినఈపెద్దమనిషి,ఒకస్వీపరులాబతకవలసిరావటమేమిటి..ఎంతోమంచిమనిషిలా,కనిపిస్తున్నఈమనిషిబతుకు,ఇంతఘోరంగాదిగజార్చడంఏమిటని..లండనునగరంలో,గొప్పగొప్పవాళ్ళునివసించే,పడమటిప్రాంతంలోగుసగుసలుప్రారంభమయ్యేయి.


                         'స్నాడుగ్రాస'యితేతనపాత్రలోజీవించేసేవాడు.అలావీధంతాతుడుస్తూఎవరైనాకనికరించిఓపెన్నీచేతులోపెడితేకళ్ళకిఅద్దుకునితీసుకునిజేబులోవేసుకుంటూఉండేవాడు.రోజూఅతనుఅలాకంపెనీఎదురుగాతుడుస్తూనిలబడిఉండటంచూస్తూఉంటే,గుర్రపుసార్టులుదిగిఆభవనంలోకివెళ్ళాల్సినడైరక్టర్లకి,తలవంపులుగాతోచేది..పోనీఆన్యూసెన్సునుండితప్పించుకోవటానికిపోలీసుకంప్లైంటుఇద్దామనుకుంటే,ఏ నేరం చేసేడని చెప్పగలరు.పైగా అతడు చేసే పని సమాజానికి ఉపయోగపడేదిగా నే ఉంది.రోజూ తను చేస్తున్న పనిలో అతను ప్రదర్శిస్తున్న అంకిత భావం చూస్తూన్న ప్రజలలో అతనిపట్ల జాలి పెరిగిపోతూ ఉంది.కంపెనీ డైరక్టర్లు 'స్నాడు గ్రాసు'చేస్తున్నపనికిఎలాంటిప్రతిక్రియచేయలేని స్థితిలోపడి పోయేరు..

 ఈపరిస్థితిహిందూదేశంలోఅయితేవాళ్ళుఏదైనాచేయగలరు.తమస్వంతదేశంలోతమపేరుపొందినకార్యాలయంముందుపెంకితనంగాఅతనుచేసేపనిమరికొందరికిప్రేరణనిస్తేఏంచేయాలోవాళ్ళకితెలీలేదు.చివరికిఅతనితోరాజీపడడమేగత్యంతరంలేనిదనినిర్ణయించేరు.అందుకుగానుఅతనుచేస్తున్నపనిముందుఆపేస్తే,అతనిసంగతిపరిశీలిస్తామని,కబురుపెట్టేరు.తనకిన్యాయంగా,రావలసినపింఛనుమొత్తంతననుఉద్యోగంలోతొలగించినతేదీనుండితనకిఇస్తేనేతప్ప,తానుపనిమాననిఎంతోవినయంగాఅతనుజవాబిచ్చేడు.మారుమాటన్నదిలేకుండాఛైర్మన్,డైరక్టర్లుఏకగ్రీవంగాతీర్మానాలుచేసిఅతనుఅన్నవన్నీచేసివాళ్ళతలనొప్పులుపోగొట్టుకున్నారు.ఆమర్నాడు'స్నాడుగ్రాసు'మంచికొత్తసూటుతొడుక్కుని,దొరటోఫీపెట్టుకుని,జోడుగుర్రాలబగ్గీఎక్కిఆఫీసుకు,డైరక్టర్లకుధన్యవాదాలుచెప్పడానికివచ్చివాళ్లతోఒకమాటఅన్నాడు."అయ్యా...ఈనాటినుంచీనా సంవత్సరాదాయం5వేలపౌన్లుఅయ్యింది.అందుకు మీకునా ధన్యవాదాలు"అన్నాడు.


 ఇంకఆనాటినుంచీ'స్నాడుగ్రాసు'బతుకుతీరేమారిపోయింది.చిలకసముద్రంలో అతను బతికిన తీరు లోకి మళ్ళీ వచ్చేడు.లండను నగరంలో విలాసవంతులు నివశించే మేఫెయిర్ ప్రాంతంలోని ఛెస్టరు ఫీల్డులో ఒక పెద్దభవంతిని తనకోసం తీసుకున్నాడు. 1824 లో ఓరియంటల్ క్లబ్ ని స్ఠాపించేడు.దానిలో విలియం బెంటిక్,డ్యూక్ అఫ్ వెల్లింగ్ టన్,సర్ జాన్ మాల్కలం'వంటివాళ్ళుసభ్యులయ్యా రు.లండను మెరైన్ సొసైటీలో 15 ఏళ్ళు సభ్యుడిగా గౌరవాన్ని పొందేడు.లండ ను స్త్రీల  ఆసుపత్రికి ఇతను మహారాజ ఫోషకుడిగా కూడా వుండేవాడు.అలా లండను నగరంలో గొప్ప గౌరవాన్ని సంపాదించుకున్నాడు. 1834 ఆగష్టు నెల 29 న మరణించేడు.తను చనిపోవడానికి మూడేళ్ళముందు అతను విల్లు రాసేడు. ఛార్లెస్ లాసన్ తాను రాసిన మెమొరీస్ ఆఫ్ మద్రాసు పుస్తకంలో ఆ వివరాలను రాసేడు.అతడు తన స్నేహితులకూ స్నేహితురాళ్ళకూ  ఈ కింది విధం గా తన అక్రమ సంపాదనలను అందించేడు.



 రంభ పట్టణంలో 'స్నాడు గ్రాసు'  ప్రజాధనంతో కట్టిన ఇల్లు


1. చిలక సముద్రం తీరాన్న రంభలోఉన్న తన ఇంటినీ, భూమినీ, గాబ్రియేల్ గిల్బర్ట్ అనే తన స్నేహితుడికి రాసేడు.( అది 30 ఏళ్ళు ఖాళీగా ఉండి కళ్ళికోట రాజు చేతిలోకి పోయింది) .

2.తనుదోచికూడబెట్టినఆస్తికిముగ్గురినిట్రస్టీలుగానియమించఆపనిచేయడానికివాళ్ళకిప్రత్యేకంగా డబ్బు కేటాయించి,మిగిలినతనఆస్తిలోకొంతభాగాన్నితనసోదరికీ,మెరైన్ ట్రస్ట్ కీ,స్త్రీల ఆస్పత్రికీ పంచేడు.

3.తనకు40వేలపౌనులువిలువచేసే(పదిలక్షలఫ్రాంకులువిలువచేసే)బాండుల'పారిసు'బేంకులో(మననల్లధనంకోటీశ్వరులు,స్విట్జర్లాండుబేంకుల్లోదాచుకున్నట్టు,అతనుదాచుకున్నవి.)ఉన్నాయనీ,వాటినీ,వాటిమీదఏడాదికివచ్చే1200పౌనులువడ్డీని'ఎలీజారస్సెల్'అనేకన్యకిఇవ్వాలనీ,అవేకాకుండాఛెస్టరుఫీల్డులోఉన్న10వనెంబరుఇంటినీ,తనగుర్రపుబగ్గీనీ,వీలునామాలోరాయకుండావొదిలేసిన ఇతర చరాస్తులన్నిటినీ ఆమెకే ఇవ్వాలనీ రాసేడు.



(విశాఖ జిల్లాలోని "ఎలమంచిలి" ప్రత్యేకత గురించి తర్వాత పోష్టులో..)





7, జూన్ 2015, ఆదివారం

"ఊరి మురుగు నీరు ఏమడి లోకి వెళ్ళుతుందో ఊరి నాయుడు ఆమడే దున్నుతాడు."


"ఊరి మురుగు నీరు ఏమడి లోకి వెళ్ళుతుందో ఊరి నాయుడు ఆమడే దున్నుతాడు."-అన్నది  'డాకరుషి' ప్రవచనం.



ఇదిమద్రాసుప్రెశిడెన్సీలోకళింగసీమఉన్నపుడు, సుమారురెండువందలఏభై  సంవత్సరాలకిందట,కిందట,లంచగొండీ,అవినీతిపరుడూ,అయిన*"స్నాడ్ గ్రాస్' అనేపేరున్నబ్రిటీషునాయుడు..అతనిసహోద్యోగులూ,డబ్బుకోసం,కళింగసీమను,దున్నినతీరు,చిలకసముద్రంలోవెలిగించిన,వైభోగంగురించి చెపుతున్నకథలాంటినిజం.."చిలక సముద్రంకథ"


అవినీతిలోమనవాళ్ళెంతోముందుకువెళ్ళేమనిలోలోపల,సంబరపడిపోతున్నారు.వీడియోటేపుల్లోఅడ్డంగాదొరికిపోయినాకూడా,తమవాడునిర్దోషిగానేబయటకువస్తాడనిమీడియాలోనిర్భయంగావాగగలుగుతున్నారు.. అలాఅవినీతినిఅన్నంమెతుకుల్లాతింటున్నవాళ్ళతో,మీదిఅవినీతే..కాదనం..ఆబెంగమీకుఅవసరంలేదు.కానీ,మీకన్నాచాలాగొప్పవాడుఅయినఆంగ్లేయుడొకడు,చాలాకాలంకిందటే,మీకన్నాఎక్కువగామాకళింగసీమలో,అవినీతినిభోంచేసి,దర్జాగాబయటికివచ్చిసత్కారాలు,సన్మానాలూపొందినవాడయ్యేడు.అతనుమాకళింగసీమలోని,గంజాంజిల్లాని,పీకలలోతుఅవినీతిలోకి,కూరినఇంగ్లీషువాడే...ఆసంగతిమాకుబాగాతెలుసుఅనిచెప్పడానికీ, మేంరాష్ట్రప్రభుత్వంతీరుతెన్నులేకాదు.కేంద్రప్రభుత్వంపరిపాలనలోకూడాఅవినీతినికూడా పసిగట్టగలుగుతామనీ,అయినామేం ఏంచెయ్యమనీ,మేమంతానిమీలితనేత్రాలబుధ్ధులమనీ, మావల్లఏరాజకీయనాయకుడికిగానీ,ఎటువంటిఉద్యోగికిగానీ,ఎటువంటిఆపదాఎన్నడూకలగదనీ...అలాజరిగినట్టుఇన్నివేలఏళ్ళలోనూ,కనీసంఒక్కదాఖలాకూడా,ఎవ్వరూచూపలేరనీ,మనకళింగసీమవాసులంతాగర్వంగా,గొంతెత్తిమరీచెప్పాలన్నదే ఈ పోష్టు వెనుక ఉద్దేశ్యం. 


 *ఈపోష్టుచదివేందుకువీక్షకులకి,కొంచెంఎక్కువసమయమేపడుతుందని,అది,చాలాఇబ్బందినేకలిగిస్తుందని తెలిసినా, ఇందులోగతంలోనిజంగాజరిగినసంగతినే,పేర్కొనడంజరిగిందికనుక,మన్నించమని వీక్షకులకి మనవి.


ప్రస్తుతరాజధాని'అమరావతి'రాజధానినిర్మాణంకోసంగౌరవ'నవ్యఆంధ్రప్రదేష్'ముఖ్యమంత్రిశ్రీచంద్రబాబునాయుడుగారు,మొదటికూలీగానేడుజరిపిన,'భూమిపూజ'కిగానీ,,ఆయన'భూమిదున్నటాని'కిగానీ,మరేఇతరరాజకీయపార్టీవిన్యాసాలకిగానీ,సంబంధించినదిమాత్రం,ఈపోష్టు'శీర్షిక'కాదు....కాదు.ఎవరైనాఅన్వయించుకోవాలనుకొంటే,అందుకునాకే,అభ్యంతరమూలేదు.అన్వయించుకొనేవాళ్ళ,అపారమేధోప్రతిభకి నేను చేసే వందనాలకి లెక్కే ఉండదు. 
                                                   కళింగరాజ్యఉజ్వలచరిత్రను,క్రోడీకరించుకుంటున్నఈ'కళింగకేక'సందర్బంలోమన'వేమన'లాంటిఅస్సాం'డాకరుషి'ప్రవచనాన్ని,అన్వయిస్తూ,మంచిఅధికారీ,మహనీయుడు,అయిన'బ్రౌనుదొర'మాత్రమే,కాదుమహానయవంచకుడు.'క్లైవు'కూడావంచలేకపోయిన,లండనునగరంలోఉన్నఈస్టిండియాకంపెనీసైతంఅతన్నేమీచెయ్యలేక,దండంపెట్టేసిమరీగౌరవించినవాళ్ళదేశపు,వంచకుడు(కళింగులనుబానిసలుగాచూసి,గంజాంజిల్లాను,భారీగాదోచిన,జమీందార్లూ,రాజులూసైతంచిన్నబోయేలా,తలదించుకునేలాచేసి)"స్నాడుగ్రాస్'అనే,గంజాంజిల్లాఆంగ్లకలెక్టరు,తాలూకా రెండువందలఏభైఏళ్ళకిందటి దోపిడీ గురించిచాలాకొద్దిగానే,చెప్పాలని,కళింగసీమవాసులతో,ఇతరప్రాంత వీక్షకులతో,పంచుకోవాలనుకుంటూ....సాక్ష్యాధారాలతో రాసిన రాత.



ప్రస్తుతం.ఒడిషారాష్ట్రంస్వంతంచేసుకున్న,ఎప్పటినుంచో,అదిమాదేఅంటున్న'చిలకసముద్రా'నికిసంబంధించిన,విషయం.అది'చిలకసముద్రం',కళింగసీమ'వాసులస్వంతఆస్తిగా,బ్రిటిషుప్రెశిడెన్శీలోఉన్నప్పుడు(రైలుమార్గంఇంకాఏర్పడనప్పుడు)జరిగినసంగతి.తానైతే,ఈసంగతులెన్నడూ,ఆరాష్ట్రంచెప్పదు...ఎందుకంటే,'స్నాడుగ్రాస్'కళింగసీమవాసుల,ధనాన్నేదోచుకున్నాడు.

ఒడిషాఅయితే..ఏకంగామొత్తంకళింగసీమలోని,అపారవనరులున్నభాగాన్నే,దేశానికి స్వాతంత్రం రాకముందే, పొద్దున్నే లేచిన పిట్టలా,దోచుకున్నదికదా..!




                                       
'హంటరు'అనేచరిత్రకారుడుచిలకాసరస్సుకుదక్షిణానఉన్నకొండలవరుసఒరియాప్రాంతానికిదక్షిణప్రాంతసరిహద్దుఅనిఖచ్చితంగారాసేడు.అసలుగంజాంజిల్లాయేఒరిస్సాప్రాంతంలోనిదికాదు.1936కుముందున్నఎప్పటిచరిత్రచూసినాఏరాజురాజ్యంచిత్రపటాలుచూసినాగంజాంజిల్లా,కోరాపుట్టి,పర్లాఖిమిడి,గుణుపురం,జయపురం,బరంపురం కళింగ సీమలోనివే.


ఆనాడేకాదుఈనాడేకాదు.ఏనాడూకళింగసీమలోతమసీమకోసంపోరాడితేగానీతమకేన్యాయమూ,జరగదన్నసంగతిగుర్తించిననాయకుడెవ్వరూ*ఈనాలుగుజిల్లాలలోనూలేకపోవడంవల్లనే,ఈ'కళింగసీమకొనలుసాగి,తనర్చి,తలిర్చిన,నవమాలికాలతలా,రత్నగర్భలాఉన్నప్పటికీకళింగమాతతనయులుగర్భదరిద్రులుగా,'కేడమూకలు'గానే ఉండిపోతున్నారు..



చిలకసముద్రం:






వెయ్యేళ్ళకిందటిబ్రహ్మాండపురాణంలో,చిలకసముద్రాన్నిగంగసాగరంగాపేర్కొంది,అంతేకాదు..బర్మా,మలయా,సియాం,చైనా,సుమత్రా,జావా,బాలి,బోర్నియో,శ్రీలంకలనుండీ,వేలకొద్దీఓడలువచ్చేవనీ,అవిరాగిరేకులతోకప్పబడిఉండేవనీ,నీటిఆవిరితోనడిచేవనీ,వాటికిందచక్రాలుఅతకబడిఉండేవనీ, వంటిఅనేకవివరాలు కూడా,అందులో రాసి,ఉన్నాయి.కళింగులుఅపారమైననౌకానైపుణ్యాన్నికలిగిఉన్నవారని,దేశదేశాలాఉన్నపేరు,గోపాలపురం,కళింగపట్టణం,కోరంగి,గంగసాగరం,ఱేవుపట్టణాలవల్లద్వారాజరిగిన,నౌకావ్యాపారాలవల్లవచ్చిందే.. ఆపేరు,ఏనాడూ, ఏదేశ చరిత్రలోనూ ఉత్కళ వాసులు లేదా ఓడ్రులు  పొందలేదు.



గంజాంజిల్లాలో"చిలకసముద్రం"అనేఈపెద్దసరస్సుఉంది.బంగాళాఖాతానికీదీనికీమధ్యగజాలదూరంమాత్రమేతేడాఉంది.అంటేఅంతవెడల్పుగాఉన్నఇసుకదిబ్బమాత్రమేసముద్రానికీదీనికీఅడ్డం.లేకపోతేఇదిసముద్రభాగమే.డిశెంబరునెలనుండీ'జూను'నెలవరకూదీనిలోనినీళ్ళుఉప్పగాఉంటాయి.వర్షాకాలంలోమాత్రం,అవితియ్యగాఉంటాయి.విదేశీపక్షులకిఇదివలసలఆవాసం.భారతదేశానికి'వైస్రాయిగా'పనిచేసిన'లార్డుకర్జన్'ఇక్కడికివచ్చిదీన్నిచూసి,"ఈచోటునుంచికనబడేద్రుశ్యంభారతదేశంలోకల్లా,సుందరమైనదనినాకనిపిస్తోంది"అన్నాడు.దీనికిదక్షిణంలోపడమరభాగంలోచిన్నచిన్నరాతికొండలునీటిలోకిచొచ్చుకునివచ్చిలంకల్లాగాకనిపిస్తాయి.వీటిలోఒకదానిపేరు"బ్రేక్ ఫాస్ట్ ద్వీపం". ఈసరస్సు మధ్యలో 'కళ్ళికోట' రాజుగారి భవనం ఒకటి ఉండేది.

'థామస్  స్నాడ్ గ్రాస్'1759 లో ఇంగ్లాండులోనే జన్మించినా అతడితండ్రి ఈస్టుఇండియా కంపెనీ లో పనిచేసేడు కనుక 1777 లో తాను చెన్నపట్టణం లో  సెయింట్ జార్జి కోటలో రైటర్ పదవిని పొందేడు. 1782 లో ఫాక్టరు అనేపదవిని,1790 లో సీనియర్ మర్చెంట్ హోదానీ,గంజాం అసిస్టెంట్ రెసిడెంట్ పదవినీ పొందేడు.


అతడు గంజాంజిల్లాకి రెసిడెంటు గా వచ్చిన రెండేళ్ళకి జిల్లాలో కరువు తీవ్రంగా వచ్చింది.(కిందటేడు కళింగ సీమకి దాపురించిన హుధుధ్ తుఫానులాగఅన్నమాట.)ఈస్టిండియాకంపెనీఉద్యోగులకు,భారతదేశం అంటే తవ్వుకోడానికి దొరికిన బంగారుగనే..స్నాడు గ్రాసుకి మద్రాసు నుండి దొరలెవ్వరూ ప్రయాస పడి రావడానికి ఇష్టపడని కళింగ సీమలో తను చేస్తున్నజిల్లాఅధికారిఉద్యోగం,జిల్లాకివచ్చిపడ్డకరువు,సిరులనేపండించేయి.జమీందారులందరినీ అదుపులో వుంచుకుని పనికి ఆహార పధకాన్ని ప్రకటించి ఆకలితో మలమల మాడుతున్న వాళ్ళచేత పనులు చేయించి వాళ్ళకి ప్రభుత్వ ధనంతో గంజి పోయించేడు.ఆ చేయించిన పనులలో గంజాం పట్టణానికి పది మైళ్ళ దూరంలో ఉన్న రంభ పట్టణంలో చిలక సముద్రం వొడ్డున కట్టించిన,నాటికాలంలోనే ఇరవై వేల రూపాయల విలువైన అందమైన భవనం కూడా ఉంది. అది తన స్వంత నివాసం చేసుకున్నాడు.సొమ్ము ప్రభుత్వానిదీ అంటే ప్రజలదీ,కట్టిందీ ప్రజలే..భవనం మాత్రం అతనిదే అన్నమాట.



'జాన్ లా' అనే అతడు తన 'గ్లింప్సెస్ ఆఫ్ హిడెన్ ఇండియా' అనే పుస్తకంలో గంజాం జిల్లాకి కలెక్టర్ గా ఉన్న   'థామస్  స్నాడ్ గ్రాస్' చేసిన పనులగురించి ఇలారాసేడు.






            "స్నాడ్ గ్రాస్"రంభలోకట్టించినదివ్యమైనభవనాన్నిఎంతోఅందంగా అలంకరించేడు.తన సాలలలో మంచి గుఱ్ఱాలనీ,ఏనుగులనీ కూడా కట్టి ఉంచేడు.పెద్ద నవాబు లాగా అతను జీవించే వాడు.రంభ పట్టణం మారు మూలగా ఉంది.మద్రాసు నుండి కలకత్తా వెళ్ళే ఇంగ్లీషు పెద్ద దొరలు తిన్నగా సముద్రం మీద ఓడల్లో అక్కడికి వెళ్ళిపోతారు గానీ గంజాంజిల్లాకు రారు.(అది ఇంకా రైలు దారులు పడని కాలంనాటి సంగతి.ఎప్పుడైనా ఎవరైనా ఇన్స్పెక్షన్ కి వస్తే  స్నాడ్ గ్రాస్ వాళ్ళని మామూలుగా పంపేవాడు కాదు.గొప్ప గొప్ప విందులు ఏర్పాటు చేసి,వేటలు ఏర్పాటు చేసి,వాళ్ళకడుపులు,జేబులు నింపి మరీ పంపేవాడు.అతడు కట్టుకున్న ఇంటికి ఎదురుగా చిలక సముద్రంలో రెండు మైళ్ళ దూరంలో ఉన్న 'బ్రేక్ ఫాస్ట్ ద్వీపం'ఐలాండులో తన పనికి అంతరాయం ఎవరూ కలిగించకుండా ఉండటానికి ఒక్కటే గదిని కట్టించి అది తన ఆఫీసు అన్నాడు.తన రెవెన్యూ లెక్కలూ ఆఫీసు రికార్డులూ అన్నీ దాన్లో పెట్టించేడు.దానికిఎదురుగా,ఒకఎత్తైనస్థూపాన్నికట్టించి...దానిపైనవెలుగుతున్న దీపాన్ని ఉంచేవాడు.దానికి 'దీప స్థంభం' అన్న పేరు పెట్టేడు.


 అప్పుడున్నమద్రాసుగవర్నరు'ఛార్లెసుఓఖ్లే'గంజాంజిల్లాలోకరువునివారణ కోసంప్రభుత్వంధనంచాలాఎక్కువగాఖర్చయ్యిందనీ,వివరాలుతెలియజెయ్యడానికి'స్నాడ్గ్రాస్'నిమద్రాసురమ్మనమనీకబురుపెట్టేడు..అతనుచెన్నపట్టణంవెళ్ళిరావడానికిపట్టేకాలంలోపనిచెయ్యడానికి'ఏక్టింగురెసిడెంట్ని'మద్రాసుగవర్నరునియమించేడు.'స్నాడ్గ్రాస్'గంజాంజిల్లానుంచిచెన్నపట్టణంకోసంబయల్దేరివెళ్ళగానే,అంతవరకూఊరుకున్నజమీందార్లంతాతాముస్నాడ్గ్రాస్ఆదేశాలమేరకుఅతని దుబాసీ గోపాలక్రిష్ణమ్మకి చాలాసార్లు చాలా డబ్బుని ఇచ్చేమనీ వాటిలో వేటికీ తమకి అతడు రశీదులివ్వలేదనీ ఫిర్యాదు చేసేరు.ఈ ఫిర్యాదులవల్ల అతడు తన దుబాసీకి విపరీతమైన చనువు ఇచ్చేడనీ అతడు కూడా చాలాడబ్బు తినేశాడనీ తేలింది.అప్పుడు ఏక్టింగు రెసిడెంటు తన పై వాళ్ళ కి ఆ సంగతి తెలియ చేసి దుబాసీ మీద కేసు పెట్టి బలవంతం గా కొంతసొమ్ము కక్కించేడు. ఆ తర్వాత ఉద్యోగం తీసేసేడు.గోపాలక్రిష్ణమ్మ ఆ తర్వాతెప్పుడూకనిపించకుండామాయయ్యేడు.రుజువైపోయినఈతప్పుకు రెసడెంటుపదవికారణంఅనిభావించి,గవర్నరు1794లోగంజాంజిల్లాకిరెసిడెంటుపదవిని తీసేసి కలెక్టరు పదవిని కల్పించేరు. పదవిలోకి 'వాల్టరు బాల్ఫరు' అనే అతన్నినియమించేరు.'స్నాడ్గ్రాస్'నినాలుగేళ్ళుఏపదవీలేకుండాఖాళీగాఉంచేరు.ఆతర్వాతమళ్ళీఅతన్నే,గంజాంజిల్లాకి,కలక్టరుగానియమించేరు.అతనుఈనాలుగేళ్ళలో,ఏమీమారలేదుసరికదామరింతచెడిపోయేడు.కలెక్టరయ్యేక,మరింతరెచ్చిపోయేడు.పాతదుబాసీస్థానంలోఅతణ్ణిమించినవాడైన'జగన్నాధరావు'ని,నియమించిసర్వాధికారాలూఅతనికేఇచ్చితానురంభపట్టణంలోతనఇంటిలోనేవిలాసంగాజీవిస్తూఉండేవాడు.తనమనసుకునచ్చిన,అందమైనవేశ్యనుకూడాతననివాసంలోనేఅట్టేపెట్టుకున్నాడు.ఆమెఅతనిపరిపాలనని,తనచుట్టూనే,తిప్పుకునేది.

గంజాంజిల్లామాన్యూలురాసిన'మాల్టుబీ'చెప్పినట్టుగంజాంజిల్లాలోనిఅన్నిప్రభుత్వశాఖలూపుచ్చిపోయేయి.గంజాంపట్టణంలోదుబాసీతనకోకార్యాలయంఏర్పాటుచేసుకున్నాడు.కలెక్టరుతో,ప్రభుత్వానికి శిస్తు ఇవ్వడం వంటి విషయాల్లో మాట్లాడుకోవాలనుకున్నజమీందారులుముందుదుబాసీదర్శనంచేసుకోవాలి..ఆయనదర్శనానికి,వెళ్ళేటప్పుడు,ఎవరైనాసరేఖాళీచేతులతోమాత్రంవెళ్ళకూడదు.గంజాంజిల్లాలో కలెక్టరు ఉపేక్ష వల్లా,దుబాసీ అవినీతి వల్లా ప్రభుత్వానికి శిస్తులరాబడి బాగా మందగించి పోయింది.


 అప్పుడు మద్రాసు గవర్నరు గా రాబర్టు క్లైవు ఉన్నాడు.అతడు ప్రభుత్వాదాయం తగ్గిపోవడానికి సంజాయిషీ ఇమ్మని స్నాడ్ గ్రాస్ ని అడిగేడు.దానికి తడుముకోకుండా,వర్షాలు సకాలంలో కురవక పోవడం వల్ల పంటలు పండటం లేదనీ,ప్రజల్లో దబ్బు లేదనీ,జిల్లాలో జమీందారులెవరూ తను చెప్పిన మాట వినటం లేదనీ,కొండజాతి వాళ్ళు అల్లర్లు చేస్తున్నారనీ,శాంతిభద్రతలు కాపాడాలంటే తనకి తగిన సైన్య సిబ్బంది లేరనీ,జవాబిచ్చేడు. క్లైవు తక్కువ వాడు కాకపోవడంవల్ల ప్రభుత్వఆ దాయం తగ్గిపోవడానికి ఇంత తెలివిగా సమాధానం చెప్పిన కలెక్టర్లెవరూ లేరని భావించి,స్నాడ్ గ్రాస్ ని తప్పించి అతని స్థానంలోబ్రౌను దొరని,కలెక్టరుగా నియమించేడు. అయితే బ్రౌను గంజాంరావడానికి ఎక్కువ సమయమే పట్టింది. స్నాడ్ గ్రాస్ ను రంభ పట్టణం నుంచి కదపటం  అంతతేలిగ్గా మాత్రం జరగలేదు.. బ్రౌను గంజాంజిల్లా వ్యవహారాలను చక్కబెట్టాలని ఎంతగా ప్రయత్నించినా అతనికి అది సాధ్యం కాలేదు. మంచి అభివ్రుధ్ధిలో ఉన్నటువంటి జిల్లా పాడైపోయిందనీ,జనసంఖ్య కూడా క్షీణించిందనీ అతను పైకి రాసేడు. 1793 కీ 1801 కీ మధ్య గంజాంజిల్లాలో జరిగిన ప్రభుర్వ వ్యవహారాలు తెలుసుకోవడానికి రికార్డులేవీ లేవని 'మాల్ట్ బీ' తన మాన్యూల్ లో రాసేడు..తనపై సాక్ష్యం ఏదీ లేకుండా చేయాలని స్నాడ్ గ్రాస్ ఆ రికార్డులన్నీ చిలక సముద్రంలో పారేయించాడనీ,ఆ రికార్డులకోసం తన దగ్గరకు రంభ పట్టణానికి వస్తే ప్రాణం తీస్తానని అతను బ్రౌను ను బెదిరించేడనీ కూడా ఓ కథ ప్రచారంలో ఉంది. ఎలాగయితేనేం బ్రౌను దొర చాలా సమస్యలనెదుర్కుని స్నాడ్ గ్రాస్ సంగతుల్ని బయటకిలాగగలిగేడు మద్రాసు ప్రభుత్వం అతనిమీద కేసు పెడదామని అనుకుని అది తమ పరిధిలోకి రానిదనుకుని ఊరుకుండిపోయింది. చివరికి1800 నుండి 1804 వరకూ అతన్ని మద్రాసులోనే ఖాళీగా ఏ పనీ ఇవ్వకుండా ఉంచేరు..1804 లో విలియం బెంటిక్ గవర్నరుగా వచ్చేక అతడిని పనిలోంచి తీసేసేరు.స్నాడ్గ్రాస్ తన మూటా ముల్లే సర్దుకుని ఇంగ్లాండ్ వెళ్ళేడు. 

ఇక్కడితో ఇతనికథా,అతనితో ముడిపడ్డ చిలక సముద్రంకథా పూర్తవ్వలేదు. తర్వాత అతను మరో తమాషా చేసేడు . 

(దాని సంగతి తర్వాత పోష్టులో...)





-------------------------------------------------------------------------------------------------------------------------
 *ఇది స్వర్గీయ దిగవల్లి వేంకట శివరావు గారి "కథలు-గాధలు" పుస్తకం నుండి సేకరించినది. ఆయన కి నామన: పూర్వక వందనాలు.

*స్వర్గీయ పి.వెంకట్రామయ్య,బ్రుందావన్ పాత్రోవంటినాయకులుఇఛ్ఛాపురం నుండి, గంజాంను ఒరిస్సాలో కలిపెందుకు వ్యతిరేకంగా పోరాడేరు.కరపత్రాలు పంచేరు.బరంపురం నుండి విలీనానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడావేసేరు.
*నేటిఒడిషాలోనిఘుంసూరు,బుగుడాపట్టణాల్లోవిలీనానికివ్యతిరేకంగాఉద్యమమే నడిచింది.

*జయపురంరాజైనవిక్రమదేవవర్మ,టెక్కలి,చీకటి,కళ్ళికోటయువరాజులువిలీనానికి అనుకూలంగా లండను వరకూ వెళ్ళి మరీ అనుకూలంగా పోరాడేరు.

*స్వర్గీయ పట్టాభి సీతారామయ్య గారి సంపాదకత్వంలో మచిలీపట్టణం నుండి వెలువడ్డ" జన్మభూమి అన్న ఇంగ్లీషు పేపరు (నవంబరు 15,1924 లో)కళింగ సీమకు చెందిన ఒరియా మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలను ఒడిషాలో విలీనం చేయటాన్ని వ్యతిరేకిస్తూ,రాసింది.

*బరంపురంనుండిఆశా,నవీన్,పత్రికలు,కటక్ నుండి ఉత్కళ దీపిక,సమాజ్ పత్రికలు విలీనాన్ని తీవ్రంగా సమర్ధించేయి.

*సైమన్ కమిషన్ 1928 లో విలీనానికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది.

*బరంపురంలో,మే9వతేదీ,1932లోవిలీనానికివ్యతిరేకంగాసభజరిగింది.గంజాంజిల్లానుఒరిస్సాలోవిలీనంచెయ్యకూడదని,అందుకుచేపట్టేవ్యతిరేకోద్యమానికివిజయనగరం,బొబ్బిలిరాజులనుండివిరాళాలుసేకరించాలనీతీర్మానాలుఆసభలో జరిగేయి.

*అదేబరంపురంలోని,'సీతారాంవిలాసఫిల్మ్'హాలు'లోగంజాం,విశాఖపట్టణం,తెలుగువారిసమావేశం,వి.రామదాసుపంతులుగారుఅధ్యక్షులుగాజరిగింది.ఆయనమద్రాసున్యాయవాది.జూలై11,1932ఒరిస్సా ఏర్పాటు వ్యతిరేకోద్యమంగా పాటించాలని,భాషాపరంగానేరాష్ట్రవిభజనజరగాలనీఆసమావేశంతీర్మానించింది. 

*1933మార్చి18వతేదీననాటి'హోమ్'గవర్నమెంట్'రాజ్యాంగసవరణలకుశ్వేతపత్రాన్నిప్రకటించింది.అయితేదానిలోపేర్కొన్నఒరిస్సారాష్ట్రసరిహద్దులలోజైపూర్,పర్లాఖిమిడిప్రాంతాలనుఒరిస్సాలోకలపలేదు.దానిమీదఒరిస్సాకాంగ్రెసువాదులుపోరాడేరు.పర్లాఖిమిడిరాజు,కళ్ళికోటరాజు,లింగరాజపాణిగ్రాహి,భుబనానందదాసు,శ్యామసుందరగంటాయతులు,లండనువెళ్ళి,స్టేట్ శెక్రటరీని కలిసి,తీవ్రంగావాదించేరు.అప్పుడుమార్పులొచ్చేయి.కటక్,సంబల్పూర్,పూరీ,బాలాసోర్ లతో పాటు,గంజాం కోరాపుట్లను ఒరిస్సాలో కలిపేరు.



1, జూన్ 2015, సోమవారం

" అణ్యాంక భీమేశ్వరాలయం"

'అణ్యాంక'(అనియంక)అంటే,'యుధ్ధంలోముందునిలబడ్డవాడు'అన్నఅర్థంఉంది.'అన్యంకభీమ'అన్నది,వజ్రహస్తరాజుకిఉన్నఇంకో పేరుకూడా...

" అణ్యాంక భీమేశ్వరాలయం"

ముఖలింగక్షేత్రంలోచూడవలసినమరొకప్రాచీనదేవాలయంభీమేశ్వరాలయం.ఇదిమధుకేశ్వరాలయానికి100గజాలదూరంలోనేఉంటుంది.అదిచాలావరకుకూలిపోయి,శిధిలావస్థలోనేఉంది.దీనిలోఉన్నశిల్పాలు,మధుకేశ్వరాలయంలోనిశిల్పాలు,ఒకేలాఉంటాయి.ఈదేవాలయంగోడలమీద,స్థంభాలమీద,గాంగవంశరాజులు,రెండోవజ్రహస్తుడు,అనంతవర్మచోడగంగదేవుడు,కాలంనాటిశాసనాలు,చాలాకనిపిస్తాయి.ఇవిఆనాటితెలుగుభాషలోనే,చెక్కించబడినవి.ఈదేవాలయంలోనల్లగామెరిసే,శివలింగానికి'అణ్యాంకభీమేశ్వరు'డన్నపేరుఉంది.అదిఇంద్రనీలమణిలాగా,రాత్రుళ్ళుమెరిసేస్వభావం,కలిగిఉన్నది.మంటపంనుంచిప్రాకారంవైపు,బయటకిపోవటానికి,దక్షిణంవైపుత్రోవఉంది.ఆగోడలమీదఉన్నశాసనాలన్నిటిలో,నగరంలోవేంచేసిఉన్న'అణ్యాంకభీమేశ్వరు'డన్నపేరేకనబడుతుంది'అణ్యాంక'(అనియంక)అంటే,'యుధ్ధంలోముందునిలబడ్డవాడు'అన్నఅర్థంఉంది.'అన్యంకభీమ'అన్నది,వజ్రహస్తరాజుకిఉన్నఇంకో పేరుకూడా..అలాఆదేవాలయంకట్టించినరాజుపేరు, అక్కడిదేవుడికివచ్చింది.అదిఅప్పుడెప్పుడోఆనాడేజరిగినా,ఈనాటిదాకాఅలాగేఉంది.అందుకేకాబోలు,నేడుకూడామనపాలకులు,తమపేర్లునిలబడిపోవాలని, చాలాచిన్నఆశతో,అలాంటివేఎన్నెన్నోపనులు,నిస్వార్ధంగాచేస్తుంటే,మనంసంబరాలతో అంబరాన్నంటేలా,పండగలే కదా..చేసుకుంటున్నాం.'కాలమేకదామారింది..మనంకాదుకదా'..


ఇప్పుడు,గౌరవనీయభారతప్రధాని,శ్రీమోదీగారి'స్వఛ్ఛభారత్','జనధనయోజన'పధకాలనూ,స్వర్గీయరాజకీయనేతల,'రాజీవుగ్రుహకల్ప','ఎన్టీఆరుసుజలస్రవంతి'అన్నపేర్లుఉన్నపథకాలను,తలుచుకుంటేనే,మననేత్రాలుఆనందాశ్రువులతోనిండిపోయి,చెఱువులైపోవటంలేదా.....మనశరీరాలుపులకించిపోయి,రోమాంచితాలుకావటంలేదా..మనం,ప్రతీరోజుకడుపునిండిపోయేంత,పరమానందాన్నిపొందటం లేదా..?


మరికొన్నాళ్ళకి,తిరుపతిదేవుడి,పేరుని"నారాచంద్ర వేంకటేశ్వరస్వామి", అనీ,యాదాద్రిదేవుడిపేరుని"చంద్రశేఖరనరసింహస్వామి",అనీమార్చాలని,ఆఇద్దరుపాతదేవుళ్ళవిగ్రహాలనూ,తమఅన్నలరూపాల్లోకిమార్చి,తమకికన్నులపండుగకలిగించాలనీ,తమఅన్నలకోసంవారిఅభిమానులునిరాహారదీక్షకికూర్చుంటే, నీళ్ళటేంకులుఎక్కి,దూకేస్తామనిబెదిరిస్తే,పెట్రోలుమీదపోసుకుని,అగ్గిపుల్లకనబడక,దానికోసం,వెతుక్కుంటూ,చిందులుతొక్కుతుంటే,మనంకళింగులంకూడా,అది అలాగే,జరిగితీరాలని,సమైక్యంగాపోరాడితీరుతాం..మీడియాల్లో,పత్రికల్లో,మనపండితప్రకాండులు,మేతావులు,ముద్దులమతాలమురిపెంపుపెద్దలూ,జ్నానవిజ్నాన ఇంద్రజాలదురంధరులూ, ఇందుకోసం అనర్గళఉపన్యాసాలని,రచ్చరచ్చచర్చలని,మనకోసంవొండివడ్డిస్తారు. అందులోసందేహం,ఏమీఅవసరంలేదు.చివరాఖరికి..కాగలకార్యంనెరవేరితే,చనిపోయినవారికి,ఒకస్థూపంకట్టేస్తారు..దానిముందునిలబడిదండాలుపెడతారు.ఏంపోతుందనీ..కావలసినదానికన్నాఎక్కువేదొరుకుతుందికదా..!.

అదేజీవన్మరణపోరాటమనుకుని,రంగంలోకిదిగి,ఉద్యమాలకిఊపిరులూది,చనిపోకుండాబతికున్నవాళ్ళసంగతెవరికికావాలనీ..అందుకుఉదాహరణలెన్నిలేవనీ..మచ్చుకుమన కళింగ సీమనుంచే,ఒకదానిగురించి చూద్దాం.


"మధురవాణి అంటూ ఒక వేశ్యాశిఖామణి ఈ కళింగ రాజ్యంలో వుండక పోతే, భగవంతుడి స్రుష్టికి ఎంత లోపం వచ్చి వుండును" అని కరటకశాస్త్రులు, చేతగురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో చెప్పించినట్టు, 


'అమ్రుతరావు'లేకపోతే,'స్వర్గీయశ్రీపొట్టిశ్రీరాములు'గారిలాఆయననిరాహారదీక్షకి,కూర్చోకపోతే(1972నాటి)'జైఆంధ్రా'ఉద్యమం,ఇంస్థాయికివచ్చివుండేదా..అని.మనంఆయనగొప్పదనాన్నితలుచుకుని ఆరోజుల్లోతన్మయత్వంలోతడిసిముద్దైపోతుంటే,మన'అమ్రుతరావు'చేత,దీక్షను,తెలంగాణావాడైన,నేటి గౌరవనీయరేవంతరెడ్డిగారిలా..అదేతెలంగాణాకిచెందిన,కీర్తిశేషులూ,గౌరవనీయులూ,అయిననాటిమర్రిచెన్నారెడ్డిగారు,మనకెవరికీ,తెలీనిఏవేవో,ఊసులు,చెప్పివిరమింపచేసేక,'జైఆంధ్రా'ఉద్యమాన్నివిజయవంతంగా,నీరుకార్చగలిగేడనిగట్టివాడనిపేరూ,పదవులూ,భోగాలూ,భాగ్యాలూ,తమఅధిష్టానవర్గంనుండి,ఆయన,పొందగలిగేడుగానీ, ఆ...అమ్రుతరావు,ఏమయ్యేడనిఎవరైనాపట్టించుకున్నారా..?

అతడు,మనకళింగసీమలోనే,ఓమూల,తన బతుకుతెరువుకోసం 'ప్రభుత్వహాస్టల్లోకుక్'గాబతికేడన్నసంగతి,మనలోఎంతమందికితెలుసు..?




వెయ్యేళ్ళకిందటనే'అన్యంకభీమ'రాజు,శివుడిపేరుకి,తనపేరుతగిలిస్తేఎవరూఅడగలేదు.ఆరాజూపోయి.ఆరాజ్యమూపోయిఆదేవాలయంకూడాకూలిపోతున్నా,శివుడిపేరు'అణ్యాంక భీమేశ్వరు'డనేకదాఈనాటికీమిగిలిఉంది.

కనుకమనదేశరాజకీయనాయకులుఆపాతకాలంనాటిరాజులకిఏంతీసిపోయేరనీ..ఆనాటిచక్రవర్తులకన్నాతక్కువెందుకవుతారనీ..వాళ్ళుచేసేవాటిని'ఎందుకిలా.?.అని,మనదేశపౌరులెప్పుడూఅడగనివాళ్ళేకదా..మన'కళింగులం',అందరిబాధామనబాధేఅని,మనకోసంతప్పమిగిలినఅందరికోసం,ఏంచెయ్యడానికైనాఅందరికన్నాముందే,ఎప్పుడూసిధ్ధంగాఉండేవాళ్ళమేకదా."మాదిమాదే..మీదిమాదే.. అంతామనదే".అనివాళ్ళుఎవరైనాపాడితే.."మీదిమీదే..మాదిమీదే..అంతామనదే" అనిచప్పట్లు కొడుతూమరీ,వంతపాడేవాళ్ళం కదా!  


"ముఖలింగేశ్వర శివలింగము": 

ముఖమంటపంనానుకుని,ఉన్నగర్భగుడిలో,'మధుకేశ్వరశివలింగము'కనిపిస్తుంది.సాధారణంగాశివలింగాలునల్లరాతితోచేయబడి,పానఘట్టంలోఅమర్చబడికనిపిస్తాయి.ఇక్కడమాత్రంఅలాకనబడదుతెల్లగాశిలలాగాకనిపిస్తుంది.ముందువైపునాశిక,నేత్రాలు,నుదురు ఉన్నట్టుచూపిస్తారు..వెనుకపక్కఅన్నిదేవాలయాలలో,శివలింగంఉన్నట్టేఇక్కడాకనిపిస్తుంది.ముందువైపు,నల్లనిమచ్చలుకనిపిస్తాయి.మరొకవిశేషంకూడాఈగర్భగుడిలో,కనిపిస్తుంది.శివలింగంవెనుకఒకచాలా'పెద్దమట్టిబానలేదాకుండ'కనిపిస్తుంది.దీనిలోస్వామివారిని,అభిషేకించేజలాన్నినిలవచేస్తారు.అదిచాలాబరువుగాఉన్నరెండడుగులలోతు,అయిదడుగులవెడల్పు,ఉన్నమట్టిపాత్ర.ఆమట్టిపాత్రపెంకుదళసరిరెండుఅంగుళాలుఉంటుంది.చూడడానికిఅదిపూర్వం,బెల్లంవండేపెనంలాకనిపిస్తుంది.అం పెద్దదిఆచిన్నగర్భగుడిలోకి,ఎలాచేరిందన్నసంశయంకలిగినవారికిఆసంశయాన్నిపోగొట్టేందుకు,ఒకకథచెపుతారు.మధుకేశ్వరస్వామికిపరమభక్తుడయినఒకకుమ్మరిరెండుపెద్దబానలను,ఆయనకిసమర్పించేందుకుతయారుచేసి,ఆలయానికితీసుకువచ్చేడు.అప్పటికే,ఆలయనిర్మాణంపూర్తయిపోవడంవల్లఆరెంటినీ,లోపలచేర్చాలనిఅతనుప్రయత్నిస్తే,ఒకబానపగిలిముక్కలైపోయింది.అతనుచింతలోములిగిపోయి,ఆరాత్రిఅంతాఅక్కడేమధుకేశ్వరుణ్ణిధ్యానిస్తూఉండిపోయేడు.భక్తవత్సలుడయిన,పరమేశ్వరుడుఆభారాన్నితనమీదవేసుకునిఆరాత్రే,మిగిలిపోయినమట్టిబానను,తనగర్భగుడిలోకిచేర్చేడు.ఉదయాన్నేదేవాలయానికి,తనుఏంచేసి,తనుఎంతోప్రేమతోశివుడికిఅర్పించాలనుకున్నబాననుగర్భగుడిలోకిచేర్చాలోఅని,ఆలోచిస్తూవచ్చినఆకుమ్మరి,భగవంతుడికరుణవల్లజరిగినపనికి,పరమానందభరితుడయ్యేడు. ఇందులోఆశ్చర్యాన్నికలిగించేఆంశంఏమిటంటే,పదిఇరవైమందికలిసిదాన్నిఒకచక్రంలాగాలోపలకితీసుకువెళ్ళాలన్నాఅదేమంతసులభసాధ్యమైనదికాదు.ఆపనిజరిపినవిధానమేఆశ్చర్యకరమైనది.


ర్భగుడిబయటివైపున్నముఖమంటపంరెండుగోడలమీదాఏకాదశరుద్రరూపాలుఅష్టమూర్తులు,పంచదేహమూర్తి,దక్షిణామూర్తి,ఉమామహేశ్వరుడు,చంద్రశేఖరమూర్తి,అర్థనారీశ్వరుడు,అఘోరమూర్తి,రక్షోఘ్నమూర్తి,భైరవుడు,కాలభైరవుడు,పాశుపతమూర్తి,వంటివిగ్రహాలుచాలానేఉన్నాయివాటికాలాన్ని,వాటిరీతులనువిశ్లేషించిరాస్తె,ఒకసిధ్ధాంతగ్రంధంఅవుతుంది.ఆశక్తి,కళింగులలోఅపరిమితంగానే ఉంది. కానీ..ఆసక్తిమాత్రమెకొరవడింది. 

ఇక్కడమరొక్కశిల్పవిశేషాన్నిగురించి,చెప్పకతప్పదు.ముఖమంటపం,దక్షిణద్వారంనుండిబయటకివచ్చితలెత్తి,వెనక్కిచూస్తే,ఒకనైపుణ్యశిల్పప్రదర్శనంమన,ఱెప్పవాల్చనీదు. అందులోపార్వతీపరమేశ్వరులుజూదమాడుతూకనిపిస్తారు.ఆపాచికలాటలోశివుడు,పార్వతీదేవిముందుఓడిపోయి,తనకున్నవన్నీపోగొట్టుకోవడమేకాక,చివరికి,తనవాహనంనందినికూడాపోగొట్టుకున్నట్టు,కనిపిస్తుంది.పార్వతీదేవి,ఆమెచెలికత్తెలువిజయానందంతో,ఆనందినితోలుకుపోతుండగాశివుడుఖిన్నుడై,నిలబడిపోయిఉండటంఈశిల్పంలోఅద్భుతంగాకనిపించేశిల్పకళావైదుష్యం.


గుడిచుట్టూఉన్నప్రాకారందగ్గర,అష్టదిక్పాలకులదేవాలయాలుఉన్నాయి.గుడికి,ఉత్తరదిక్కులోఉన్నప్రాకారానికి,బయటగోడమీదచాలాప్రాచీనమైన,ఒకయోధుడిశిల్పంఉంది.అతడుతనఎడమచేతిలోఎత్తైనవిల్లు,కుడిచేతిలోఒకఅమ్ముపట్టుకునికనబడతాడు.మొలలోకత్తికనబడుతుంది.జుత్తునున్నగాదువ్వబడి,వీరపురుష,లాంఛనమైనకోరశిఖతలపైనకనిపిస్తుంది. ఆయోధుడివస్త్రధారణ,చాలాప్రాచీనమైనదిగనే,ఉంటుంది.ఆరూపం,నాడెన్నడోఎవరోశిల్పి,చెక్కినపరమశివుడిరూపమా.?లేక ఎవరో,ఆ శిల్పికాలంనాటి'కళింగరాజు'రూపమా..?అన్నది తెలుసుకోవటంమాత్రం కష్టమవుతుంది.




అష్టదిక్పాలకుల,దేవాలయాలలోవాయుదేవుడిదేవాలయం,మీదకొన్నిప్రాచీనశాసనాలు(తెలుగు,కన్నడలిపులలో)కనిపిస్తాయి.వాటిలో'త్రైలోక్యభీతదేవర,"న్రుపతుంగనరసింహుణ్డు"అనిచదవగలిగేవి,కనిపిస్తాయి.గుడిదాటిబయటకివస్తే,పక్కనేఒకఆంజనేయఆలయంఉంది.ఆఆలయంమరీపాతదేం,కాకపోయినప్పటికీ,దానినిర్మాణంలోఉపయోగించిన,రాళ్ళుకొన్నిచాలాపాతవే.ఆరాళ్ళమీదకూడాచక్కని,ప్రాచీనశిల్పాలుకొన్నిఉన్నాయి.ఒకరాయిమీద,యుధ్ధరంగంలోయేనుగులు,ఢీకొనిదెబ్బలాడుతున్నట్టు,చిత్రీక్రుతమైఉంది.బాణాలువచ్చి,,గుచ్చుకుంటున్నా,ఒకయేనుగులక్ష్యపెట్టకుండా,తనకాలికిందఒకతన్నితొక్కిపట్టి,తనతొండంతో,మరొకయేనుగుతోయుధ్ధంచేస్తున్నట్టూ,ఆయేనుగుమీదఒకమావటికూర్చున్నట్టూ,ఆశిల్పంలోకనిపిస్తుంది.


మరొకటి,ఆంజనేయస్వామిగర్భాలయం,బయటిగోడమీదకనిపిస్తుంది. అదిచాలాప్రాచీనమైనదే,అనిచెప్పగలశిల్పం.దానిలోమనుష్యునిమొహంతో,ఉన్నఒకమొసలిమీద,కూర్చునికొందరుయోగులు,చుట్టూఉన్నజలంలోప్రయాణంచేస్తున్నట్టుమనంచూడొచ్చు.

"సోమేశ్వరాలయం"

ఊరికిదూరంగాసోమేశ్వరాలయంఉందిగానీఅదిసుమారు150ఏళ్ళకిందట,పిడుగుపడిపునాదులంటాకదిలిపోయింది.దీనినిర్మాణశైలిభువనేశ్వరజగన్నాధదేవాలయంలాఉండెదిఅని,అనిపిస్తుంది.


 ("చిలక సముద్రం కథ" తర్వాత పోష్టులో)










23, మే 2015, శనివారం

"కళింగులు శిల్పకళా చాతుర్యంలో ఆరితేరినవారు"

            

కళింగులు శిల్పకళా చాతుర్యంలో ఆరితేరినవారుదేవాలయ నిర్మాణంలో వాళ్ళు పూర్తిగా దక్షిణాది వారి శైలినేఅనుకరించిన వారు కాలేదుమధుకేశ్వరాలయం చూసినప్పుడు ఆసంగతి స్పష్టంగా కనబడుతుంది.


...వస్తుశిల్పంలోచలనద్రుక్పధం,వీరిశిల్పకళలోకొట్టొచ్చినట్టుకనబడే,నైపుణ్యంఈదేవాలయాలలోఉన్నప్రత్యేకశిల్పాలనేకం..కనుబొమలు,చెతివేళ్ళుశిల్పకళలోవీరికున్నగొప్పతనాన్నితెలియచేస్తాయి.వాళ్ళనైపుణ్యాన్నివేలసంవత్సరాలతర్వాతకూడాపరిశీలించినవారు,రెండుచేతులూపైకెత్తిమరీఆశిల్పులనిర్మాణకౌశల్యానికినమస్కరించవలసిందే.ప్రాచీనకళింగదేశంలో'కళాకన్య'తనబంగారుగజ్జెలతోనర్తించి,దేశదేశాలనీ,తనగానంతో,ఉత్కంఠపరిచేదని,చాలా...కొద్దిగానేఇంకామిగిలిపోయున్న సాక్ష్యాలు..ఢంకామీదకొట్టినట్టుగాచెపుతాయి....గుర్తించగలమా..లేదా అన్నదే..మిగిలున్న ప్రశ్న.

*అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన మధుకేశ్వరాలయంలోని కొన్ని శిల్పాల గురించిన వివరాలలోకి వెళితే....


ముఖలింగదేవాలయం,చుట్టూప్రాకారంఉంది.లోపలదేవాలయం.దానిచుట్టూఅష్టదిక్పాలకులుకళ్యాణమండపాలుదీని,నిర్మాణంలోనిభాగాలు.ప్రాకారంసింహద్వారానికిఎదురుగాఉండేధ్వజస్ఠంభం,నడివీధిదానిగామారిపోవటానికి,కారణందేవాలయప్రాంతం,ఆక్రమణలకి,లోనవ్వడమే.....







1.ధ్వజస్ఠంభంఎదురుగాసింహద్వారం,ద్వారానికిరండుపక్కలారాతితోచెక్కబడినవెనుకకాళ్ళమీదకూర్చున్నరెండుసింహాలుకనబడతాయి.గుడిలోకివెళ్ళటానికి,మెట్లుఎక్కుతున్నపుడుసింహద్వారానికిముందుఎడమవైపు,ఒకశిల్పంతోకూడినఱాయివుంటుంది.దానిమీదఒకవిలుకాడిబొమ్మ,అతడికివింజామరతోవిసరుతున్నమరొకతనిబొమ్మచెక్కబడిఉన్నాయి.అంతేకాకుండా,ఆవిలుకాడుతనకాళ్ళకిందఒకవ్యక్తినితొక్కుతున్నట్టుగాఆరాయిమీదచెక్కబడిఉంది...ఒకరాజుతనశత్రువునుజయించికాళ్ళకిందతొక్కి,అవమానిస్తున్నట్టుగానే,అనుకోవాలి.
  మంటపంలాఉన్నసింహద్వారానికి,రెండుపక్కలాఉన్నస్థంభాలమీదసింహద్వారంగోడలమీదప్రాచీనగాంగవంశపురాజులువేయించినశాసనాలుచాలానేఉన్నాయి.




2.సింహద్వారానికిఎడమపక్కనేమరొకరాతిపలకఉంది.దానిమీదఒకపురుషుడు,స్త్రీలింగరూపంలోఉన్నశివుడినిపూజిస్తున్నట్టుచెక్కబడిఉంది.శివలింగానికిపైనసూర్యచంద్రులబొమ్మలువాటికిందఒకహస్తంకూడాకనబడతాయి.ఆశిల్పంలోవ్యక్తివివరాలుచెప్పేఆధారాలురాసిలేవు,కానీఆమధుకేశ్వరఆలయాన్నినిర్మించినరెండవకామార్ణదేవుడిదేఆబొమ్మఅనిఅనుకోవడంసరైనదేఅవుతుంది.

3.సింహద్వారందాటిలోపలకిఅడుగుపెట్టగానే,ఒకపెద్దనందివిగ్రహంకనిపిస్తుంది.ఆనంది,కెదురుగాఒకమంటపం,ఆమంటపంలోనికి,ఒకద్వారంకూడాకనిపిస్తాయి..ఆద్వారానికి,రెండుపక్కలాఉన్నగోడలరాళ్ళమీద,చెక్కినన్రుత్యభంగిమల్లోఉన్నటువంటి,స్త్రీలబొమ్మలుకనిపిస్తాయి.ఆవిగ్రహాలనుఅక్కడచెక్కిన,శిల్పిదేనిని,ఉద్దేశించిఆరూపాలనుచిత్రీకరించేడో,ఆకాలంనాటి సామాజిక పరిస్థితుల విశ్లేషణ జరిపితేనే కానీ తెలియదు.


ఆ ద్వారాన్ని దాటి లోపలకి ప్రవేశిస్తే,చిన్న నంది విగ్రహం, దానిపైన విశాల ప్రాంగణం కనిపిస్తాయి.దేవాలయ శిఖరం కూడా కనిపిస్తుంది.ఇది రెండవ సింహద్వారం అవుతుంది.ఇది మొదటి దానికంటే చిన్నది.ఈ ద్వారానికి తలుపులు లేవు.అంతా శిల్పమయమే.ఆ ద్వారాన్ని దాటి లోపలకి వెళ్ళేక వెనక్కి తిరిగి చూస్తే,

4.ద్వారం పైన ఒక ఏడెనిమి అడుగుల పొడవు అడుగున్నర వెడల్పుతో ఉన్న ఒక రాతిమీద చెక్కిన కథాచిత్రం మనకెన్నో విశేషాలను చెప్పేదానిలా కనబడుతుంది.ఆ పలక మధ్య్ల లో ఒక చెట్టు,ఆ చెట్టుకు ఎడమపక్క ఒకవేదిక మీద కూర్చున్న ఒక వ్యక్తి అతడికి వింజామరతో విసురుతున్న మరొక మనిషి కనిపిస్తారు.అతనికి వెనుక 15 మంది శాంతపురుషులు స్థిరంగా కూర్చున్నవాళ్ళు కూడా కనిపిస్తారు.చెట్టుకు కుడివైపునుంచి బలమైన కత్తి పట్టుకుని ఒక మనిషి ప్రాకుతూ వస్తున్నట్టు,అతను ఆ చెట్టును నరకాలనే వస్తున్నట్టు కనబడుతుంది..అతని వెనకాతల ఇద్దరు స్త్రీలు ఉంటారు.వాళ్ళల్లో ఒకామె నిలబడిరెండు చేతులూ జోడించి కనబడుతుంది.రెండో ఆమె కూర్చుని ఉంటుంది.ఆ ఇద్దరు స్త్రీల వెనకా 21 మంది ఆయుధపాణులైన క్రోధావేశపరులైన పురుషులు కూడా నిలబడి ఉంటారు.వేదికమీద కూర్చున్న వ్యక్తి అతనిని వారిస్తున్నట్టు కనిపిస్తుంది.బొమ్మ మధ్యలో ఉన్న చెట్టు మొదట ఒక పద్మపీఠం కనబడుతుంది. ఈ రాతి పలకలోని చిత్రం మొత్తం మనకి ముఖలింగ క్షేత్ర మహాత్మ్యం కథను చెపుతున్నట్టే కనబడుతుంది.
       
      ఈచిత్రంలోచాలాస్పష్టంగాకనిపిస్తున్నమనుషులవస్త్రధారణ,కేశాలంకరణ ,కళింగజాతిజనులకీఇతరప్రాంతాలజనులకీఉన్నటువంటి,సంస్క్రుతీ,సంప్రదాయాలభేదాలనీ,రూపురేఖావిలాసాలలోనితేడాలనీకొట్టొచ్చెలా చూపుతాయి.వీటినిబట్టిక్రీ.స్తుశకారంభంలోనివశించినట్టికళింగదేశస్తులనుగురించిచాలావివరాలనూతెలుసుకోవచ్చు.తలలమీదఒకవైపున్నగుండ్రనితలకొప్పులు,నడుములచుట్టూబిగదీసికట్టినఅంగవస్త్రం,దానిమీదబిగించినకాసె,మొలనూలు,చూసేవాళ్ళలోఆసక్తినిరేకెత్తించేలా,ఇవితమజాతిపూర్వీకులవిఎంతమాత్రంకావనిఇవివేరేజాతివాళ్ళపూర్వీకులవని,వాళ్ళుకళింగులేననీ,ఇతరప్రాంతవాసులకిచూడగానేఅర్థమైపోయేలా,ఈరోజుకీకనిపిస్తాయి.ఆయుధాలతో,నిలబడ్డవాళ్ళెవ్వరికీవొంటిమీదరెండోవస్త్రంఏదీలేదు.వాళ్ళమెడలోహారాలుమాత్రమేకనిపిస్తాయి.చెట్టునరకాలనిముందుకువస్తున్నఅతని,ముంజేతులమీదకంకణాలు,మురుగులుకనబడతాయి.అతనివక్షస్థలంచుట్టూమరొకవస్త్రం(కంచుకంఅనొచ్చేమో..)అతనుమిగిలినవారందరికీఏలికఅన్నభావాన్నికలగచేస్తుంది.

(అలాఅంతతేడాగాకనిపించినా,కనిపిస్తే.వాటిగురించిఏఆలోచనాఈనాటికీ,రానికళింగులని,చూసిన,ఆసామాన్యకౌశల్యాపూరితుడైనచిత్రకారుడిఆత్మఅనేదేదైనా,ఇంకాఉంటే..దానిబాధకికొలతఉంటుందా..?)


ఈ రాతి పలక మీద పదిచేతులున్న చండికాదేవి శిల్పం కూడా దానంత పాతదే కనిపిస్తుంది.ఆ మూర్తి చేతుల్లో వున్న వస్తువులను సింహాసనారూఢ అయిన ఆ ప్రసన్న వదనాన్ని చూస్తే ఆమె కాళికా దేవా..? లేకపొతే జైన మత 'చక్రేశ్వరీ'దేవా..అన్నఅనుమానంకూడాకలుగుతుంది.




5.ముఖమంటపంగోపురాన్నిచూస్తే,ఆగొపురం4పలకలమీదపైకిలేచికనబడుతుంది.ఆపలకలనే,ఆగమశాస్త్రంలో'భూమికలు'అంటారు.ఈనాలుగుపలకలమీదాఅందమైనచిత్రాలుచెక్కబడిఉన్నాయి.

6.మొదటిపలకమీదఆరుహంసలు,వాటిలోరెండేసిహంసలమధ్య,ఒకపదహారురేకులకమలం,చెక్కబడిఉన్నాయి.దానిమీదున్నపలకమీదఇరువురుమల్లయోధులుద్వంద్వయుధ్ధంచేస్తూకనిపిస్తారు.వాళ్ళచుట్టూజనసమూహం,కొంచెందూరంలో,ఎడమవైపురాజు,రాణి,కూర్చునిఉన్నట్టు,వాళ్ళకిఇద్దరుసేవకులుయుధ్ధంగురించివివరిస్తున్నట్టు,రాజుతనచెవినిచెపుతున్నవానిమాటలపైకెంద్రీకరించినట్టు,స్పష్టంగాఅర్థమవుతుంది.రాణీకిఎడమవైపుఅంతఃపురస్త్రీలు,వాళ్ళపాదాలదగ్గర,సేవికలుసుఖంగాకూర్చున్నట్టు,కనిపిస్తుంది.మల్లయోధులున్నప్రాంతానికికుడివైపు,జనసమూహానికిపైనబ్రాహ్మణసమూహంకూర్చున్నట్తు,వాళ్ళముందుయేనుగులుతలపడుతున్నట్టుకనబడుతుంది.అనుభవపండితులు,చెప్పినమేరఆయుధ్ధం,శ్రీక్రిష్ణ,చాణూరుల...మల్లయుధ్ధమనీ..చూస్తున్నరాజు'కంసుడ'నీ,యేనుగులకాళ్ళదగ్గిర,కనిపిస్తున్నదిబాలక్రిష్ణుడనీఊహించాలి.

ఇందులో...ఆశ్చర్యంకలిగించేదేమిటంటే,అయిదారుగజాలపొడవు,అడుగున్నరకిమించివెడల్పువుండని,ఆపలకమీద,ఈవివరాలన్నీచెక్కడంలోశిల్పిచూపించినచాతుర్యం..ఆనైపుణ్యాన్నివేయినోళ్ళతోపొగిడితీరాల్సిందే..సూక్ష్మంగాబొమ్మలుచెక్కడమేకాదు..జనసందోహం,హావభావాలనికూడావేలఏళ్ళపాటునిలిచిపోయేలా,స్పష్టంగాచెక్కినఆఅపరమయుడికితలవొంచినమస్కరించాల్సిందే.

7.అంతకన్నాపరమానందాన్నీ,నిబిడాశ్చర్యాన్నీకలిగించేశిల్పం,ఆపైనున్నపలకమీదకనిపిస్తుంది.ఇందులోతనపేరు,ఎవరికీచెప్పాలనేఆలోచన,తనరూపుఅందరికీతెలియాలనే,కోరికఅసలెంతమాత్రంలేని,ఆశిల్పశేముషి,రాజువేటాడేవిధానాన్నిరూపుకట్టించేడు.వేగంగాపరుగెడుతున్నగుర్రాలనీ,విల్లునుచెవిదాకాలాగిజంతువుమీద,తనలక్ష్యాన్నిగురిచూస్తున్నరాజుని,ఇతరవేటగాళ్ళనివివరంగాచూడగలం.అంతేకాదు.ఆవేటగాళ్ళవెనకసంహరింపబడినజంతువులనుకర్రలకివేలాడదీసుకుని.వాటినిమోసుకువెళుతున్నసేవకులూకనబడతారు.వాళ్ళవెనకతప్పెటలువాయించేవాళ్ళు,మద్దెలవాయించేవాళ్ళుతమవాయిద్యాలకిపనిచెపుతూకనిపిస్తారు.బూరలుఊదేవాళ్ళు,శ్రుంగనాదాలుచేసేవాళ్ళూకనిపిస్తారు.వాళ్ళవెనుకకొందరుమ్రుగాలనుమోసుకువెళుతుంటే,కొందరుఆయుధాలనుపట్టుకునిపరుగెడుతున్నారు.కొందరుఆశ్వికులు,బల్లేలనుపట్టుకుని,గుర్రాలనునడిపించుకుంటూవెళుతున్నారు.ఈశిల్పంలోనేఎడమవైపుసగభాగంలోవేటకుఉద్దేశించినమ్రుగాలుమరికొన్నిపరుగులుతీస్తున్నట్టూ,వాటికిముందూ,వెనుకాఆశ్వికులు,వేటగాళ్ళుఆయుధాలుధరించిపరుగుపెడుతున్నట్టుకనిపిస్తుంది.రాజులమ్రుగయావినోదాన్నిజీవంఉట్టిపడేలా...ఇంతఅందంగా,చిత్రీకరించినశిల్పంమరెక్కడాకనబడదు..ఇదిఒకపురాణగాధగానీ,చారిత్రకఅంశంగానీకానేకాదు.ఒకసామాజికఅంశంమాత్రమే..ఆరోజుల్లోఇలాచిత్రీకరించాలనుకున్నశిల్పిగొప్పతనాన్నిగానీ,ఆపనికిఅతన్నిపురికొల్పినరాజుకళాభిరుచినిగానీ,ఏఇజంఅనిచెప్పాలి,దీనిమీదద్రుష్టిఎవరూ..ఏనాడూ..ఎందుకుపెట్టరు..కళింగ శిల్పమనా..?

8.ఇంక,ఆఖరిపలకనిచూస్తే,'యేనుగులవేట',అందులోచిత్రితమైఉంది.ఇదికళింగరాజులకు,తర్వాతికాలంలోని,గజపతులకుఎంతోఇష్టమైన'గజవేట'.ఈపలక,ఎడమభాగంలోఒకవేదికమీదతనచుట్టూచేరినసేవకులు,ఖడ్గహస్తులు,ధనుర్విద్యానిపుణులు,పరిచారకులుమధ్యఒకకులీనపురుషుడుకనిపిస్తాడు.......వాళ్ళముందుమచ్చిక,అయిఉన్నయేనుగులమీదకూర్చున్నమావటివాళ్ళు,యేనుగులవేటజరుపుతున్నారు.వాళ్ళముందుతాళ్ళతో,బంధింపబడ్డఅడవియేనుగులు పారిపోవాలని ప్రయత్నిస్తున్నట్టు ఈ శిల్పంలో కనిపిస్తుంది.

కొంచెంముందుకువెళితే,ఆరుస్థంభాలతోఉన్నముఖమంటపంఉంటుంది.ఈస్తంభాలపై శిల్పాలు లేవుగానీ చాలా శాసనాలు చెక్కబడి ఉన్నాయి.ప్రతీఏడూ వీటిమీద సున్నం పూతలు పూస్తూ ఉండటం వల్ల వాటి ఉనికి చాలావరకూ పోయింది.కొన్ని వైష్ణవ శిలావిగ్రహాలు ఎక్కడనుండో తెచ్చి ఉంచినట్లనిపించేవి కనిపిస్తాయి..ఒక శాసనంలో ఈ ప్రాంతంలో ఉన్న వైష్ణవ దేవాలయం ప్రస్తావన ఉంది..కానీ ఆ దేవాలయం ఇప్పుడెక్కడాలేదు. ఇక్కడ ఉన్న శిల్పాలు ఆ దేవాలయం తాలూకావి అయిఉండవచ్చు.అవి త్రివిక్రమావతారమూర్తి,దానికి కుడివైపున వరాహమూర్తి.ఆ విగ్రహం కింద అమరావతి లోకనిపించే నాగకన్యల విగ్రహాలవంటి ఇద్దరు నాగకన్యలు.ఈ విగ్రహాల నడుము నుండి పైవరకు మనుష్య రూపం తలవెనక పాము పడగ, నడుము కింది భాగమంతా సర్పశరీరము కనబడతాయి. ఇందులో ఒక నాగకన్య చేతిలో తామర పద్మం ఉంది.దాని మీద వరాహమూర్తి ఎడమ పాదం ఆన్చి ఉంది. రెండవ నాగకన్య తనరెండుచేతులతో,ఆమూర్తి కుడికాలును పట్టుకున్నట్టు కనిపిస్తుంది.ఇక్కడ వరాహమూర్తి విగ్రహరూపానికీ, దక్షిణాది దేవాలయాలలో కనిపించే రూపానికీ చాలా తేడా కనిపిస్తుంది.ఈ మూర్తికి నాలుగు చేతులు ఉంటాయి.పై రెండు చేతుల్తోఈమూర్తిభూమినిగట్టిగాపట్టుకున్నట్టుఉంటుంది.మిగిలినరెండుచేతులలో,కుడిదానితోచక్రాన్నీ,ఎడమదానితో,శంఖాన్నీపట్టుకున్నట్టుకనిపిస్తుంది.వరాహమూర్తివిగ్రహంవెనకసూర్యనారాయణుడిరూపం ఉంది.ఆరూపం తలవెనక తేజోవంతమైనకాంతి పుంజం కనబడుతుంది.రెండుచేతులలో,రెండు దీపాలు ఉంటాయి.(ఎరుపు తెలుపు దీపాలనే అనుకోవాలి.)

9.సూర్యదేవుడివిగ్రహానికి,కుడిపక్కనగరుడనారాయణుడివిగ్రహంఉంది.ఈముఖమంటపంలోనే,మరోపక్కఅత్యంతమనోహరమైన,వేరెక్కడా,కనిపించనటవంటి,'సౌభాగ్యవాగీశ్వరీ'విగ్రహంకనిపిస్తుంది.దానిగురించిస్థానికులు.....ఆవిగ్రహంముందునుండీఅక్కడున్నదికాదనీ,ఊరిచివరనున్నపొలాన్నిదున్నుతున్నప్పుడుదొరికిందనీఅప్పుడుతెచ్చిఅక్కడపెట్టేరనీచెపుతారు.సుందరమైనమోముతో,మందస్మితాలైనపెదవులతో,నిమీలితాలైననేత్రాలతో,ముగ్ధమోహనంగాకనిపించేఈవాగ్దేవినిచూసినవారిమనసులు,నేత్రాలూభక్తితోనిండిపోతాయి.ఈమాతవిగ్రహంలో,కొన్నిశైవలక్షణాలూకనిపిస్తాయి.ఆమెజడశివుడిజటాజూటంలాచెక్కిఉంటుంది.దానికిఎడమవైపుచంద్రకళఉంటుంది.సుఖాసీనఅయినఆమెముందున్నరెండుచేతులతోవీణనిపలికిస్తున్నట్టుకనబడుతుంది.వెనుకవున్నఒకచేతిలోపుస్తకంకనబడుతుంది.రెండవచేతిలోకమలంకనబడుతుంది.ఈశిల్పాన్నిచెక్కినశిల్పిపనితనం,మనకిఎనలేనిఆశ్చర్యాన్నికలిగిస్తుంది.నిత్యపూజలందుకున్నకాలంలోఆదేవి,వైభోగంఎంతగొప్పగా ఉండెదోనన్న భావం మనలో కదలాడుతుంది.

*ఈపోష్టులోపేర్కొన్నశిల్పాలలోకొన్నికనబడవు..కొన్నిభక్తులుభక్తిఎక్కువైపూసినదట్టమైనపసుపుకుంకుమలవల్లరంగు,రూపాన్నికోల్పోయేయి.మహానుభావులు'మహారాజశ్రీభావరాజువేంకటక్రిష్ణారావు'గారు,సందర్శించినపుడు(సుమారునూరుసంవత్సరములకిందటిమాట)ఆయనవెల్లడించినవిషయాలనుమాత్రమే,నేనుఇక్కడతెలియజేయడంజరిగింది.వారి స్ఫూర్తికి,నామనఃపూర్వ క వందనాలు.


(మధుకేశ్వరస్వామిగురించి..మరికొన్నిఇతరఆలయాలలోనిశిల్పాలగురించీ..తర్వాత పోష్టులో..)