కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

19, నవంబర్ 2014, బుధవారం

“పిల్లి దేవుడు-పీట ముత్తైదువు”

“పదివేలమంది సామాన్యులు మాట్లాడే పదివేల మాటలు ఒక్క రాజు ఒక్కమాటకు సరికావు”- ఇది కూడా కౌటిల్యుడు అర్థశాస్త్రం లో చెప్పినమాటే..

కళింగ రాష్ట్రం పేరు ఆధునిక భారతం లో లేకుండా చెయ్యడం,జాతీయగీతం లో" ద్రావిడ,ఉత్కళ, వంగ,కళింగా" కాకుండా "ద్రావిడ, ఉత్కళ ..  వంగా " అనిమాత్రమే పేర్కొనడం ఒక్క రాజు మాటకు,ఒక్క రాణీ చేతకు గురైనవే.

కళింగ రాష్త్రం కోసం మనం కేక పెట్టవచ్చా...?.మనం ఆంధ్రులం కదా..కళింగ రాష్త్రం అంటే,ఒరిస్సా అవుతుంది కదా….! అన్న ఆలోచన మనలో చాలా మంది కి కలిగే అవకాశం ఖచ్చితం గా వుండి తీరుతుంది.అలాంటి అన్ని సందేహాలనీ మనం చితక్కొట్టి మరీ పక్కకి విసిరెయ్యాలి. 

“పాగా,పంచా చూసి పాపరాజనుకున్నాను పేర్రాజు వటోయ్.. నువ్వుఈర్రాజూ…” అన్న పాత కాలం వెటకారం మన కళింగ సీమ వాసులపై మిగిలిన ప్రాంతాలవాళ్ళు చేస్తారేమో అన్న అనుమానం కూడా మనకి కలగొచ్చు..మనం కళింగ రాష్ట్రవాళ్ళమని,మాగధి నుండి,పాళీ నుండి మా మాత్రుభాష తెలుగే అయ్యిందనీ,అందుకు శెట్టి,నాపసాని, సొమ్ములు.. సాహు,తెలగలాంటి ఉదాహరణలు మా కళింగ విశ్వవిద్యాలయం అన్నది మాకు ఉండి ఉంటే (మా తాతల కి దేశాభిమానం చాలా చాలా ఎక్కువైపోబట్టే,ఆంధ్ర విశ్వవిద్యా లయాన్ని ఆనందంగా స్వాగతించేరు.ఆ పేరు మా ప్రాంతానికి పెట్టడమేంటన్న ఆలోచనే వాళ్ళ కలలలోకి కూడా వచ్చిన దాఖలాలే ఎక్కడా లెవు) మా భాషా శాస్త్రవేత్తలు లెక్కకి మిక్కిలిగాఅనేక పదాలు తెచ్చి రుజువు చేసి తెలంగాణా,వేరు,ఆంధ్రా వేరు,కళింగ వేరు అని ముక్కు మీద గుద్దినట్టుగా చెప్పగలిగే వారు. 

మనది మన శ్రీకాకుళంలో ఉన్నకళింగపట్నం రాజధాని అయిన కళింగరాజ్యంముఖలింగం కూడా రాజధాని అని అనుకోవచ్చు.ఎందుకంటేఅక్కడున్నదికళింగరాజులుపూజించినమధుకేశ్వరుడిఆలయంకనుక. అంతేకాదుదీర్ఘకాలకళింగచరిత్రలోరాజపురమ్దంతపురం,సింగుపురం ప్రాంతాలుకూడా కళింగ రాజధానులే..అన్న సంగతి రుజువయ్యేదే కదా ...!

చరిత్ర ఒక్కసారి తిరగేస్తే, త్రికళింగాధి పతి అయిన ,యుద్ద మల్లుని శాసనం ప్రకారం,త్రికళింగ మంటే, 1.గంగానది నుండి కటక పురి (నేటి కటక్) వరకూ ఉత్కళం,(నేటి ఒడిషా),ఉత్తర కళింగం.2.కటక పురి నుండి మహేంద్ర గిరివరకూ మధ్య కళింగం. (కన్యోఢ దేశం ) 3.మహేంద్రగిరి నుండి గోదావరి వరకూ కళింగ దేశం.

ఇలా ఎంతోఘనమైనచరిత్రకలిగిఉన్నప్పటికీ,ఏసంస్క్రుతీలేనివాళ్ళనిఅయిపోయేం.ఇవ్వాల్టికి ఇలాఏదిక్కూలేకుండాదిక్కుమాలిపోయున్నవాళ్ళమైపోయేం. ఇంకా ఇప్పుడైనా కళింగ సేన గా ఏర్పడి పెనుకేక పెట్టకపోతే .“పిల్లే దేవుడు-పీటే ముత్తైదువు అన్న చందంగావుంటుంది మన భవిష్యత్ తరాల జీవితం .అసలు మన ఉద్యమాలు మనంతట మనం ఏనాడు చేసేం కనుక.."విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు "అన్నాం".జై ఆంధ్రా "అన్నాం. ఇంకా “జై సమైక్యాంధ్రా అన్నాం..కానీ ఏనాడన్నా మనం..కానీ మన మేధావులు కానీ “జై కళింగా..జై ..జై.. కళింగా..అని అన్నారా..                                                          

                                                                      ****
 చరిత్ర మీద దట్టంగా అల్లుకున్న తెరలు ఒక్కటొక్కటిగా తొలగించుకుంటూ పోతే, నిజాలు నిజంగా మనల్ని దుఃఖ్ఖ పెట్టక మానవు.....
.త్రేతాయుగం లోకి వెళితే,ఆర్యుడైన రాముడు కిష్కింధా రాజైన (అప్పుడు కళింగ రాజ్యం పేరు వేరు గా లేదు. కిష్కింధ లో భాగం గానే.ఉండేది.) .వాలిని..అప్పట్లో ..ఇప్పుడూ.. కూడా వేదపండితులు అందరూ పూజించే దేవదేవుడు.. ఇంద్రుడి కొడుకు..
క్షీర సాగర మధనం లో దేవతలకి సహాయం చేసి,ఉద్భవించిన తార ను భార్యగా పొందినవాడు.సూర్యోదయం ముందే తూర్పు సముద్రతీరం నుండి ( మా బంగాళాఖాతం..) బయల్దేరి, పశ్చిమసముద్రతీరానికీ  ,అక్కణ్ణుంచి, ఉత్తరసముద్రతీరానికీ,దక్షిణసముద్రతీరానికీ,ప్రయాణించి సూర్యుడికి వందనం చేసేత్రివిక్రముడు.ఆ  సమయాల్లో అడ్డొచ్చేపర్వతశిఖరాల్తో బంతులాట ఆడిన పరాక్రముడు.

(Contd..)