కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

9, మే 2015, శనివారం

నా కళింగసీమ- "బలరామ దేవుడి పాదచలనం తో పులకరించిన నేల"..


"కళింగసీమ"బలరామదేవుడిపాదచలనంతోపులకరించిననేల.ఆయనఏనాడో  ప్రసాదించినలాంగుళ్యతో  నేటికీ దాహార్తినితీర్చుకుంటున్నబంగారుసీమ...నా "కళింగ సీమ .. ఇది ఖచితనవరత్నలేమ"

మహాభారతయుధ్ధకాలం...లోకౌరవులపక్షానగానీ,పాండవులపక్షానగానీ,చేరియుధ్ధంచెయ్యడానికిఇష్టపడనిబలరాముడుయుధ్ధానికిదూరంగావుండటానికితీర్థయాత్రలపేరుచెప్పిబయల్దేరిపోయేడు.


బలరాముడు


అతడు,వింధ్యపర్వతాలనుదాటి,దండకారణ్యంలోప్రవేశించి....ఒకనాటిమధ్యాహ్నాం,పద్మనాభపర్వతప్రాంతం(ప్రస్తుతంఒడిషాలోనికలాహండిప్రదేశం)లోనిమాధవవనం,లోసపరివారసమేతంగావిడిదిచేసేడు.ఆ టవీప్రాంతంలో,యాదవబలరాముడికి, ననిత్యనైమిత్తికాలునిర్వహించుకునేందుకుగానీ,మిగిలినపరివారానికి,ఏపనిచేయడానికయినా గానీ ఎంతప్రయత్నించినా,నీటిసదుపాయంకలగలేదు.విసిగిపోయినబలరాముడు,కోపంతోతన,లాంగలిని(నాగలిని)ప్రయోగించి,భూగర్భంలోనుంచినీటినిధారగాపైకితెచ్చేడు.ఆనీటితోఅతనూ,అతనిపరివారం,సంతోషంతోపనులన్నీపూర్తిచేసుకుని,ఆరాత్రిఅక్కడేనివశించేరు.ఆమరుసటిదినం,అక్కడినుంచివెళ్ళిపోతూ,బలరాముడుఆనీటిని,సముద్రజలాల్లోకలిసేలాతననాగలితోమార్గంచూపేడు. 


              శ్రీకాకుళంలోని నాగావళి

ఆనదిపేరేలాంగలిగా,లాంగుళ్యగా,నాగావళిగాపిలవబడుతోందనిఆనది,చరిత్రను,పురాణేతిహాసంచెపుతుంది.ఈనదీతీరంలో పాయకపాడు,గుంప,సంగం,శ్రీకాకుళం,కళ్ళేపల్లిప్రాంతాలలోఒకేరోజుఅదికూడాజ్యేష్టబహుళఏకాదశినాడుఆపుణ్యశీలి,పంచలింగాలనిప్రతిష్టించేడు.ఈఅయిదుక్షేత్రాలలోఒకేరోజుఅభిషేకం చేసిన వాళ్ళకి పునర్జన్మ ఉండదని కళింగ సీమ వాసుల కి పూర్వకాలంనుండీ ఉన్ననమ్మకం..అదేరోజుఆక్షేత్రాలలోశివపార్వతులకళ్యాణంచేస్తారు.

అవిమాత్రమేకాకుండా,అక్కడక్కడా(ఇంకాకాలగర్భంలోకలిసిపోయినవికలిసిపోగా, చెట్లగుబుర్లవెనకా,మట్టిదిబ్బలకిందా జాడలేకుండాపోయినవి  వాటి గుర్తులేలేకుండాపోయినా),కొన్నిమాత్రమేఇంకాశిధిలాలుగానిలబడి ఉన్నప్పటికీ,అవిపొందవలసినంతగుర్తింపుకుకూడా,నోచుకోకుండా పోతున్నాయి. పక్కరాష్ట్రంస్వంతఆస్తిగాకొన్నిమలిగిపోయి,వెలిగిపోతున్నాయి.పైనచెప్పిన,పంచలింగారామాలుమాత్రమేకాక మరికొన్నిబలరామప్రతిష్టితాలయినశివలింగక్షేత్రాల గురించి,సంక్షిప్తంగా చెప్పుకుందాం.


పంచలింగేశ్వరఆలయాలు
1.హటకేశ్వరదేవాలయం(రాయఘడదగ్గరున్నపాయకపాడు.)
2.సోమేశ్వరదేవాలయం(పార్వతీపురందగ్గరున్నగుంప)
3.సంగమేశ్వరదేవాలయం(రేగిడిఆముదాలవలసమండలంలోనిసంగం)
4.ఉమారుద్రకోటేశ్వరాలయం,(శ్రీకాకుళం.)
5.మణినాగేశ్వరదేవాలయం,(కళ్ళేపల్లి)


1.హటకేశ్వరుడు: (మరోపేరు పాటలేశ్వరుడు)


 పాటలేశ్వరుడు


కళింగసీమనుండి,తమదంటూతీసుకుపోయిన,ఒడిషారాష్ట్రవాసులప్రస్తుతంఒడిషాలోని'రాయఘఢ'దగ్గరున్నపాయకపాడుఅగ్రహారంలోనాగావళినదివొడ్డున ఉన్నశివలింగ క్షేత్రం..ఇదిబలరాముడుస్వయంగాప్రతిష్టించినశివలింగం ఉన్న ఆలయం. "ఇది మీదికాదు..మాదే"అనలేకపోయినకళింగవాసులబలహీనతకి ఉన్న ఎన్నో నిదర్శనాల్లో ఒక్కటిది


2. సోమేశ్వరుడు. 


                        సోమేశ్వరుడు. 


విజయనగరంజిల్లాలోపార్వతీపురంపక్కనేఉన్నగుంపగ్రామంలోవెసిఉన్నశివాలయంలోఉన్నశివుడు.ఇదిజంఝావతీ,నాగావళీనదులుఒకదానిలోమరొకటికలసినప్రదేశం.  ఆంధ్రహరికథాపితామహుడు"జ్జాడఆదిభట్లనారాయణదాసు"రెండెడ్లబండికట్టించుకునిమరీ...విజయనగరంనుండివచ్చిసందర్శించుకున్న క్షేత్రం ఇది.





 3.సంగమేశ్వరుడు:


సంగమేశ్వరుడు


ఈమూర్తిపార్వతీపురంప్రాంతానికే,చెందిన'సంగాం'గ్రామంలోపూజలందుకుంటున్న శివాలయంలో ని శివుడు.ఈ క్షేత్రం కూడా నాగావళీ సువర్ణముఖీ నదుల సంగమ ప్రదేశమే.






4.కోటీశ్వరుడు:
కోటీశ్వరుడు

క్రీ.శ.7వశతాబ్దంనుండీ,చరిత్రపుటల్లో కనబడుతూ,ప్రస్తుతం*శ్రీకాకుళం  పేరుతోవున్నఅంతకుముందుకాలంలోకోటీశ్వరాగ్రహారంఅన్నపేరుతోవర్ధిల్లిన,శ్రీకాకుళం జిల్లా కేంద్ర పట్టణం లో, ఉన్న శివాలయంలోప్రతిష్టితుడయిన మూర్తి. 





5.మణినాగేశ్వరుడు:


మణినాగేశ్వరుడు
నాగావళినదిసముద్రంలోకలిసేస్థానంలోఉన్నకళ్ళేపల్లి ( ఈ ఊరి మరో పేరు మఫీజ్ బందరు) గ్రామంలొ ఉన్న శివాలయ స్వామి.


మరికొన్ని ఒకప్పటి శివ తేజోనిలయాలు

దేవగిరీశ్వరుడు: 

దేవగిరీశ్వరుడు: 


నాగావళినదిజన్మస్థానానికిదగ్గరలోఉన్నదేవగిరిపర్వతగుహలో,ఈమూర్తిఉందిఒకప్పుడదికళింగసీమది.ఇప్పుడుఒడిషాలోనిరాయఘడకి48కి.మీ.దూరంలోఉన్నకళ్యాణసింగుపురంపక్కనఉన్నకొండమీదఉంది.మిగిలినకొండల్లాగా..ఈకొండకిందనించి,పైకివెళ్ళేటప్పటికి,సన్నగాఎంతమాత్రంఉండదు.పైభాగంలోచతురస్రంగావుంటుంది.ఇక్కడ గంగయమున,భార్గవి,సరస్వతి,ఇంద్రద్యుమ్నఅనేఅయిదునిరంతరంనిండుగాఉండేనీటికొలనులుఉంటాయి.ఈకొలనుల్లోనీళ్ళుపచ్చిపాలరుచులతో ఉంటాయి.





గోకర్ణేశ్వరుడు:
Mahendragiri Temple, Gajapati, Shiva Temple
గోకర్ణేశ్వరుడు
ఈక్షేత్రంచాలాపురాతనమైనది.మహేంద్రగిరిపర్వతంమీద,బలరాముడితో,ప్రతిష్టించబడినత్రిలింగమూర్తులదేవాలయాలలోప్రధానమైనదిగోకర్ణేశ్వరస్వామివెలసిఉన్నగోకర్ణక్షేత్రం.పూర్వకాలంలోబ్రహ్మదేవుడుహరిహరాదులకోసం,పరుశురాముడు,మహేశ్వరుడికోసం,తపస్సులుచేసినపవిత్ర,ప్రాంతంగా,పురాణాల్లోచెప్పబడినప్రాంతం.అశోకుడు,రక్తబాహుడు,విజయవర్మ, విజయస్థంభాలను పాతి శాసనాలను చెక్కించిన ప్రదేశం.కళింగాధీశులెందరో తమ ఇలవేల్పు అ ని కీర్తించి తమదాన శాసనాలు ప్రకటించిన ప్రదేశం.

ఒకప్పటికళింగసీమలోనిగంజాంతాలూకాలోఉండి1936నుండీబలవంతంగాఒడిషారాష్ట్రంలోకిచేర్చబడిన దేవాలయాలలోఇదికూడాఒకటి.


కపాల లింగేశ్వరుడు: 


Jaugada, Visit Jaugada of Orissa, Temple tour of Jaugada, Religious place of Orissa
కపాల లింగేశ్వరుడు:


అశోకుడి శాసనాలున్న జౌగడ (లక్కకోట) పర్వత ప్రాంతలో ఉన్న ప్రాచీన శివాలయంలోని శివ మూర్తి.

మల్లికేశ్వరుడు:

మల్లికేశ్వరుడు

ఇప్పటిఒడిషారాష్ట్రంలోని,గుణుపురందగ్గరున్న'జగమండ'గ్రామాన్నిఆనుకునిఉన్నచిన్నకొండమీద,ప్రతిష్టించబడినశివుడు.ఈమల్లికేశ్వరస్వామినిదర్శించుకుని కొండమీద15రోజులుంటేఎలాంటిరోగమైనానశిస్తుందని ప్రజల విశ్వాసం.


గుప్తేశ్వరుడు

                              

                                             గుప్తేశ్వరుడు


ఈ తేజో విరాజిత శివమూర్తి దట్టమైనఅరణ్యప్రాంతంలోఒడిషాలోని,కోరాపుట్ కీ,జయపూర్ కీ,మధ్యకొండగుహలోగుప్తంగాఉన్న గుప్తేశ్వరుడు.దుర్గమమై , కిక్కిరిసిన ఈఅరణ్యంలోపర్వతాలనుండిజాలువారుతున్నజలపాతాలహొయలు,కనులవిందుచేస్తుంటే,పక్కనే'కొలాబ్'నదిపరుగులుపెడుతుంటే..గుప్తేశ్వరస్వామిసన్నిధానం..ఎవరినైనా,రెండుచేతులూజోడించేలాగే,చేస్తుంది.కళింగరాజ్యంలో,ఈప్రాంతానికిసామంతపాలకుడయిన*జయపురంరాజు1617సంవత్సరంలోఈశివలింగమూర్తికిసన్నిధాననిర్మాణంజరిపేడు.

 "ఈ కళింగ వాసులకిఎక్కితే గుర్రపు బండి..ఎత్తితే ముష్టి చెంబు" 

అనిభావించే వాళ్ళకి మాత్రమే..

ఈకళింగసీమనీ,కళింగజాతినీ,కళింగసంస్క్రుతినీ,నిర్ధూమధామంగా..చేయగలిగేమన్నసంతోషంలోఉన్న,అన్నిఇతరప్రాంతాలతెలుగునాయకులతోపాటు,ఈభారతదేశంలోనిఇతరరాష్ట్రాల,జాతులవారుకూడాతమతప్పులుతెలుసుకునితీరవలసినకాలం..చాలాదగ్గరకొచ్చిందనీ...
ఈకళింగసీమవాసులుపెట్టే,కళింగసింహగర్జన,వీళ్ళందరిలో,కంపంపుట్టించితీరుతుందనీ,ఉదయిస్తున్నకళింగసూర్యుడు..కొద్దిగాఆలస్యమైనాసరే,దట్టంగాఅల్లుకున్ననల్లమబ్బులన్నిటినీ,దాటుకుని,తనప్రకాశంతోతిరిగితేజరిల్లుతాడనీఇప్పుడున్నకళింగ వాసులకిస్పష్టంగాతెలిసిపోతోంది.

(ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోనూ అనంత ఖ్యాతినితెచ్చుకున్నముఖలింగ దేవాలయ చరిత్ర తర్వాత పోష్టులో..)

(Contd..)
-----------------------------------------------------------------------------------------------------------------------------

*దక్కనుసుల్తానులుకళింగప్రాంతాన్నిపాలించేరోజుల్లోఆసుల్తానులసుబేదారులు ఇక్కడే నివాసముండి ఇక్కడనుండి తమప్రభువులఫర్మానాలనుసామంత ప్రభువులకు,అప్పటి రాజులకు పంపేటప్పుడు ఆ ఫర్మానాలమీద వున్న శిఖా (లక్కసీలు)విప్పిఖోల్(బట్వాడా)చేయడంచేసేవారుకనుకముందుగాశిఖాకోల్అన్నపేరుతోఆ గ్రామం,పిలవబడేదనీఅదేక్రమంగాశ్రీకాకుళంఅయ్యిందనీకూడా ఒక వాడుక ఉంది.

*క్రీ.శ.1640లోఅప్పటిసుబేదారు'షేర్మహమ్మదుఖాన్'కట్టించినమసీదుఇప్పటికీఉంది.అంతేకాదు..ఆపట్టణంప్రాచీనతకోసంవెతకాలనుకుంటే,ఎంతకాలం,వెనుకకు వెళ్ళినా ఆ కాలంలోనూ తన సాక్ష్యాధారాలను అందించగలిగేది గానే ఉంది.

*..జయపురం రాజుల చరిత్ర సంక్షిప్తంగానే..

సూర్యవంశరాజైన'వినాయకదేవ్'తోప్రారంభమైనఈరాజులపాలన508ఏళ్ళ(1443/1951)కొనసాగింది.నందపురం,జయపురంఅనేరెండుపరగణాలుగావీరురాజ్యపాలనచేసేరు.25మందిఈవంశంరాజులుఈసుదీర్ఘపాలనసాగించేరు.1637/69మధ్యపాలించిన'వీరవిక్రమదేవ్'రాజధానినినందపురంనుండిజయపురానికి మార్చేడు.

1/4/1936లోఒరిస్సారాష్ట్రంఏర్పాటయ్యేటప్పుడుపర్లాఖిమిడిపరిపాలకుడిగావున్న'విక్రమదేవ్'పాచిపెంట,మాడుగులప్రాంతాలనుతప్ప,అన్నింటినీ,ఒడిషాలోకలిపేడు.గంజాంజిల్లానుఒడిషాలోచేర్చేందుకుఈయనచేసినపనితక్కువేంకాదు.అదినచ్చకే'పిడుగులాంటిగిడుగు'పర్లాఖిమిడి,వొదిలేసితనజీవితచరమాంకంలోరాజమండ్రివెళ్ళిపోయేడు.మహారాజావిక్రమదేవవర్మతన62వఏటతగాదాలువిడగొట్టుకుని,జయపురంరాజయ్యేడు.అతనిదే..ఆరాజ్యానికిఆఖరిరాజుఅవకాశమైంది.అతనికిమగసంతానంలేకపొవడంవల్ల,తనఏకైకకుమార్తెసువర్నముఖీదేవి రెండోకొడుకుని దత్త త తీసుకున్నాడు.ఆమె భర్త పేరువిద్యాధర సింగ్ దేవ్.అతన్ని'అల్లుడురాజా'అనితెలుగు లోనే  అందరూ అనేవారు.వీళ్ళు ఓఢ్రులా..?

14/4/51లోఆయనతన82వఏటచనిపోతే,వారసుడుమైనరుకావటంవల్లరాజ్యం'కోర్ట్ ఆఫ్ వార్డ్స్'కిపోయింది.29-12-52లోఎస్టేట్రద్దయిపోయింది. 9-3-2006లోతన72వఏటఆఖరిరాజుచనిపోయేడు.