కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

23, మే 2015, శనివారం

"కళింగులు శిల్పకళా చాతుర్యంలో ఆరితేరినవారు"

            

కళింగులు శిల్పకళా చాతుర్యంలో ఆరితేరినవారుదేవాలయ నిర్మాణంలో వాళ్ళు పూర్తిగా దక్షిణాది వారి శైలినేఅనుకరించిన వారు కాలేదుమధుకేశ్వరాలయం చూసినప్పుడు ఆసంగతి స్పష్టంగా కనబడుతుంది.


...వస్తుశిల్పంలోచలనద్రుక్పధం,వీరిశిల్పకళలోకొట్టొచ్చినట్టుకనబడే,నైపుణ్యంఈదేవాలయాలలోఉన్నప్రత్యేకశిల్పాలనేకం..కనుబొమలు,చెతివేళ్ళుశిల్పకళలోవీరికున్నగొప్పతనాన్నితెలియచేస్తాయి.వాళ్ళనైపుణ్యాన్నివేలసంవత్సరాలతర్వాతకూడాపరిశీలించినవారు,రెండుచేతులూపైకెత్తిమరీఆశిల్పులనిర్మాణకౌశల్యానికినమస్కరించవలసిందే.ప్రాచీనకళింగదేశంలో'కళాకన్య'తనబంగారుగజ్జెలతోనర్తించి,దేశదేశాలనీ,తనగానంతో,ఉత్కంఠపరిచేదని,చాలా...కొద్దిగానేఇంకామిగిలిపోయున్న సాక్ష్యాలు..ఢంకామీదకొట్టినట్టుగాచెపుతాయి....గుర్తించగలమా..లేదా అన్నదే..మిగిలున్న ప్రశ్న.

*అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన మధుకేశ్వరాలయంలోని కొన్ని శిల్పాల గురించిన వివరాలలోకి వెళితే....


ముఖలింగదేవాలయం,చుట్టూప్రాకారంఉంది.లోపలదేవాలయం.దానిచుట్టూఅష్టదిక్పాలకులుకళ్యాణమండపాలుదీని,నిర్మాణంలోనిభాగాలు.ప్రాకారంసింహద్వారానికిఎదురుగాఉండేధ్వజస్ఠంభం,నడివీధిదానిగామారిపోవటానికి,కారణందేవాలయప్రాంతం,ఆక్రమణలకి,లోనవ్వడమే.....







1.ధ్వజస్ఠంభంఎదురుగాసింహద్వారం,ద్వారానికిరండుపక్కలారాతితోచెక్కబడినవెనుకకాళ్ళమీదకూర్చున్నరెండుసింహాలుకనబడతాయి.గుడిలోకివెళ్ళటానికి,మెట్లుఎక్కుతున్నపుడుసింహద్వారానికిముందుఎడమవైపు,ఒకశిల్పంతోకూడినఱాయివుంటుంది.దానిమీదఒకవిలుకాడిబొమ్మ,అతడికివింజామరతోవిసరుతున్నమరొకతనిబొమ్మచెక్కబడిఉన్నాయి.అంతేకాకుండా,ఆవిలుకాడుతనకాళ్ళకిందఒకవ్యక్తినితొక్కుతున్నట్టుగాఆరాయిమీదచెక్కబడిఉంది...ఒకరాజుతనశత్రువునుజయించికాళ్ళకిందతొక్కి,అవమానిస్తున్నట్టుగానే,అనుకోవాలి.
  మంటపంలాఉన్నసింహద్వారానికి,రెండుపక్కలాఉన్నస్థంభాలమీదసింహద్వారంగోడలమీదప్రాచీనగాంగవంశపురాజులువేయించినశాసనాలుచాలానేఉన్నాయి.




2.సింహద్వారానికిఎడమపక్కనేమరొకరాతిపలకఉంది.దానిమీదఒకపురుషుడు,స్త్రీలింగరూపంలోఉన్నశివుడినిపూజిస్తున్నట్టుచెక్కబడిఉంది.శివలింగానికిపైనసూర్యచంద్రులబొమ్మలువాటికిందఒకహస్తంకూడాకనబడతాయి.ఆశిల్పంలోవ్యక్తివివరాలుచెప్పేఆధారాలురాసిలేవు,కానీఆమధుకేశ్వరఆలయాన్నినిర్మించినరెండవకామార్ణదేవుడిదేఆబొమ్మఅనిఅనుకోవడంసరైనదేఅవుతుంది.

3.సింహద్వారందాటిలోపలకిఅడుగుపెట్టగానే,ఒకపెద్దనందివిగ్రహంకనిపిస్తుంది.ఆనంది,కెదురుగాఒకమంటపం,ఆమంటపంలోనికి,ఒకద్వారంకూడాకనిపిస్తాయి..ఆద్వారానికి,రెండుపక్కలాఉన్నగోడలరాళ్ళమీద,చెక్కినన్రుత్యభంగిమల్లోఉన్నటువంటి,స్త్రీలబొమ్మలుకనిపిస్తాయి.ఆవిగ్రహాలనుఅక్కడచెక్కిన,శిల్పిదేనిని,ఉద్దేశించిఆరూపాలనుచిత్రీకరించేడో,ఆకాలంనాటి సామాజిక పరిస్థితుల విశ్లేషణ జరిపితేనే కానీ తెలియదు.


ఆ ద్వారాన్ని దాటి లోపలకి ప్రవేశిస్తే,చిన్న నంది విగ్రహం, దానిపైన విశాల ప్రాంగణం కనిపిస్తాయి.దేవాలయ శిఖరం కూడా కనిపిస్తుంది.ఇది రెండవ సింహద్వారం అవుతుంది.ఇది మొదటి దానికంటే చిన్నది.ఈ ద్వారానికి తలుపులు లేవు.అంతా శిల్పమయమే.ఆ ద్వారాన్ని దాటి లోపలకి వెళ్ళేక వెనక్కి తిరిగి చూస్తే,

4.ద్వారం పైన ఒక ఏడెనిమి అడుగుల పొడవు అడుగున్నర వెడల్పుతో ఉన్న ఒక రాతిమీద చెక్కిన కథాచిత్రం మనకెన్నో విశేషాలను చెప్పేదానిలా కనబడుతుంది.ఆ పలక మధ్య్ల లో ఒక చెట్టు,ఆ చెట్టుకు ఎడమపక్క ఒకవేదిక మీద కూర్చున్న ఒక వ్యక్తి అతడికి వింజామరతో విసురుతున్న మరొక మనిషి కనిపిస్తారు.అతనికి వెనుక 15 మంది శాంతపురుషులు స్థిరంగా కూర్చున్నవాళ్ళు కూడా కనిపిస్తారు.చెట్టుకు కుడివైపునుంచి బలమైన కత్తి పట్టుకుని ఒక మనిషి ప్రాకుతూ వస్తున్నట్టు,అతను ఆ చెట్టును నరకాలనే వస్తున్నట్టు కనబడుతుంది..అతని వెనకాతల ఇద్దరు స్త్రీలు ఉంటారు.వాళ్ళల్లో ఒకామె నిలబడిరెండు చేతులూ జోడించి కనబడుతుంది.రెండో ఆమె కూర్చుని ఉంటుంది.ఆ ఇద్దరు స్త్రీల వెనకా 21 మంది ఆయుధపాణులైన క్రోధావేశపరులైన పురుషులు కూడా నిలబడి ఉంటారు.వేదికమీద కూర్చున్న వ్యక్తి అతనిని వారిస్తున్నట్టు కనిపిస్తుంది.బొమ్మ మధ్యలో ఉన్న చెట్టు మొదట ఒక పద్మపీఠం కనబడుతుంది. ఈ రాతి పలకలోని చిత్రం మొత్తం మనకి ముఖలింగ క్షేత్ర మహాత్మ్యం కథను చెపుతున్నట్టే కనబడుతుంది.
       
      ఈచిత్రంలోచాలాస్పష్టంగాకనిపిస్తున్నమనుషులవస్త్రధారణ,కేశాలంకరణ ,కళింగజాతిజనులకీఇతరప్రాంతాలజనులకీఉన్నటువంటి,సంస్క్రుతీ,సంప్రదాయాలభేదాలనీ,రూపురేఖావిలాసాలలోనితేడాలనీకొట్టొచ్చెలా చూపుతాయి.వీటినిబట్టిక్రీ.స్తుశకారంభంలోనివశించినట్టికళింగదేశస్తులనుగురించిచాలావివరాలనూతెలుసుకోవచ్చు.తలలమీదఒకవైపున్నగుండ్రనితలకొప్పులు,నడుములచుట్టూబిగదీసికట్టినఅంగవస్త్రం,దానిమీదబిగించినకాసె,మొలనూలు,చూసేవాళ్ళలోఆసక్తినిరేకెత్తించేలా,ఇవితమజాతిపూర్వీకులవిఎంతమాత్రంకావనిఇవివేరేజాతివాళ్ళపూర్వీకులవని,వాళ్ళుకళింగులేననీ,ఇతరప్రాంతవాసులకిచూడగానేఅర్థమైపోయేలా,ఈరోజుకీకనిపిస్తాయి.ఆయుధాలతో,నిలబడ్డవాళ్ళెవ్వరికీవొంటిమీదరెండోవస్త్రంఏదీలేదు.వాళ్ళమెడలోహారాలుమాత్రమేకనిపిస్తాయి.చెట్టునరకాలనిముందుకువస్తున్నఅతని,ముంజేతులమీదకంకణాలు,మురుగులుకనబడతాయి.అతనివక్షస్థలంచుట్టూమరొకవస్త్రం(కంచుకంఅనొచ్చేమో..)అతనుమిగిలినవారందరికీఏలికఅన్నభావాన్నికలగచేస్తుంది.

(అలాఅంతతేడాగాకనిపించినా,కనిపిస్తే.వాటిగురించిఏఆలోచనాఈనాటికీ,రానికళింగులని,చూసిన,ఆసామాన్యకౌశల్యాపూరితుడైనచిత్రకారుడిఆత్మఅనేదేదైనా,ఇంకాఉంటే..దానిబాధకికొలతఉంటుందా..?)


ఈ రాతి పలక మీద పదిచేతులున్న చండికాదేవి శిల్పం కూడా దానంత పాతదే కనిపిస్తుంది.ఆ మూర్తి చేతుల్లో వున్న వస్తువులను సింహాసనారూఢ అయిన ఆ ప్రసన్న వదనాన్ని చూస్తే ఆమె కాళికా దేవా..? లేకపొతే జైన మత 'చక్రేశ్వరీ'దేవా..అన్నఅనుమానంకూడాకలుగుతుంది.




5.ముఖమంటపంగోపురాన్నిచూస్తే,ఆగొపురం4పలకలమీదపైకిలేచికనబడుతుంది.ఆపలకలనే,ఆగమశాస్త్రంలో'భూమికలు'అంటారు.ఈనాలుగుపలకలమీదాఅందమైనచిత్రాలుచెక్కబడిఉన్నాయి.

6.మొదటిపలకమీదఆరుహంసలు,వాటిలోరెండేసిహంసలమధ్య,ఒకపదహారురేకులకమలం,చెక్కబడిఉన్నాయి.దానిమీదున్నపలకమీదఇరువురుమల్లయోధులుద్వంద్వయుధ్ధంచేస్తూకనిపిస్తారు.వాళ్ళచుట్టూజనసమూహం,కొంచెందూరంలో,ఎడమవైపురాజు,రాణి,కూర్చునిఉన్నట్టు,వాళ్ళకిఇద్దరుసేవకులుయుధ్ధంగురించివివరిస్తున్నట్టు,రాజుతనచెవినిచెపుతున్నవానిమాటలపైకెంద్రీకరించినట్టు,స్పష్టంగాఅర్థమవుతుంది.రాణీకిఎడమవైపుఅంతఃపురస్త్రీలు,వాళ్ళపాదాలదగ్గర,సేవికలుసుఖంగాకూర్చున్నట్టు,కనిపిస్తుంది.మల్లయోధులున్నప్రాంతానికికుడివైపు,జనసమూహానికిపైనబ్రాహ్మణసమూహంకూర్చున్నట్తు,వాళ్ళముందుయేనుగులుతలపడుతున్నట్టుకనబడుతుంది.అనుభవపండితులు,చెప్పినమేరఆయుధ్ధం,శ్రీక్రిష్ణ,చాణూరుల...మల్లయుధ్ధమనీ..చూస్తున్నరాజు'కంసుడ'నీ,యేనుగులకాళ్ళదగ్గిర,కనిపిస్తున్నదిబాలక్రిష్ణుడనీఊహించాలి.

ఇందులో...ఆశ్చర్యంకలిగించేదేమిటంటే,అయిదారుగజాలపొడవు,అడుగున్నరకిమించివెడల్పువుండని,ఆపలకమీద,ఈవివరాలన్నీచెక్కడంలోశిల్పిచూపించినచాతుర్యం..ఆనైపుణ్యాన్నివేయినోళ్ళతోపొగిడితీరాల్సిందే..సూక్ష్మంగాబొమ్మలుచెక్కడమేకాదు..జనసందోహం,హావభావాలనికూడావేలఏళ్ళపాటునిలిచిపోయేలా,స్పష్టంగాచెక్కినఆఅపరమయుడికితలవొంచినమస్కరించాల్సిందే.

7.అంతకన్నాపరమానందాన్నీ,నిబిడాశ్చర్యాన్నీకలిగించేశిల్పం,ఆపైనున్నపలకమీదకనిపిస్తుంది.ఇందులోతనపేరు,ఎవరికీచెప్పాలనేఆలోచన,తనరూపుఅందరికీతెలియాలనే,కోరికఅసలెంతమాత్రంలేని,ఆశిల్పశేముషి,రాజువేటాడేవిధానాన్నిరూపుకట్టించేడు.వేగంగాపరుగెడుతున్నగుర్రాలనీ,విల్లునుచెవిదాకాలాగిజంతువుమీద,తనలక్ష్యాన్నిగురిచూస్తున్నరాజుని,ఇతరవేటగాళ్ళనివివరంగాచూడగలం.అంతేకాదు.ఆవేటగాళ్ళవెనకసంహరింపబడినజంతువులనుకర్రలకివేలాడదీసుకుని.వాటినిమోసుకువెళుతున్నసేవకులూకనబడతారు.వాళ్ళవెనకతప్పెటలువాయించేవాళ్ళు,మద్దెలవాయించేవాళ్ళుతమవాయిద్యాలకిపనిచెపుతూకనిపిస్తారు.బూరలుఊదేవాళ్ళు,శ్రుంగనాదాలుచేసేవాళ్ళూకనిపిస్తారు.వాళ్ళవెనుకకొందరుమ్రుగాలనుమోసుకువెళుతుంటే,కొందరుఆయుధాలనుపట్టుకునిపరుగెడుతున్నారు.కొందరుఆశ్వికులు,బల్లేలనుపట్టుకుని,గుర్రాలనునడిపించుకుంటూవెళుతున్నారు.ఈశిల్పంలోనేఎడమవైపుసగభాగంలోవేటకుఉద్దేశించినమ్రుగాలుమరికొన్నిపరుగులుతీస్తున్నట్టూ,వాటికిముందూ,వెనుకాఆశ్వికులు,వేటగాళ్ళుఆయుధాలుధరించిపరుగుపెడుతున్నట్టుకనిపిస్తుంది.రాజులమ్రుగయావినోదాన్నిజీవంఉట్టిపడేలా...ఇంతఅందంగా,చిత్రీకరించినశిల్పంమరెక్కడాకనబడదు..ఇదిఒకపురాణగాధగానీ,చారిత్రకఅంశంగానీకానేకాదు.ఒకసామాజికఅంశంమాత్రమే..ఆరోజుల్లోఇలాచిత్రీకరించాలనుకున్నశిల్పిగొప్పతనాన్నిగానీ,ఆపనికిఅతన్నిపురికొల్పినరాజుకళాభిరుచినిగానీ,ఏఇజంఅనిచెప్పాలి,దీనిమీదద్రుష్టిఎవరూ..ఏనాడూ..ఎందుకుపెట్టరు..కళింగ శిల్పమనా..?

8.ఇంక,ఆఖరిపలకనిచూస్తే,'యేనుగులవేట',అందులోచిత్రితమైఉంది.ఇదికళింగరాజులకు,తర్వాతికాలంలోని,గజపతులకుఎంతోఇష్టమైన'గజవేట'.ఈపలక,ఎడమభాగంలోఒకవేదికమీదతనచుట్టూచేరినసేవకులు,ఖడ్గహస్తులు,ధనుర్విద్యానిపుణులు,పరిచారకులుమధ్యఒకకులీనపురుషుడుకనిపిస్తాడు.......వాళ్ళముందుమచ్చిక,అయిఉన్నయేనుగులమీదకూర్చున్నమావటివాళ్ళు,యేనుగులవేటజరుపుతున్నారు.వాళ్ళముందుతాళ్ళతో,బంధింపబడ్డఅడవియేనుగులు పారిపోవాలని ప్రయత్నిస్తున్నట్టు ఈ శిల్పంలో కనిపిస్తుంది.

కొంచెంముందుకువెళితే,ఆరుస్థంభాలతోఉన్నముఖమంటపంఉంటుంది.ఈస్తంభాలపై శిల్పాలు లేవుగానీ చాలా శాసనాలు చెక్కబడి ఉన్నాయి.ప్రతీఏడూ వీటిమీద సున్నం పూతలు పూస్తూ ఉండటం వల్ల వాటి ఉనికి చాలావరకూ పోయింది.కొన్ని వైష్ణవ శిలావిగ్రహాలు ఎక్కడనుండో తెచ్చి ఉంచినట్లనిపించేవి కనిపిస్తాయి..ఒక శాసనంలో ఈ ప్రాంతంలో ఉన్న వైష్ణవ దేవాలయం ప్రస్తావన ఉంది..కానీ ఆ దేవాలయం ఇప్పుడెక్కడాలేదు. ఇక్కడ ఉన్న శిల్పాలు ఆ దేవాలయం తాలూకావి అయిఉండవచ్చు.అవి త్రివిక్రమావతారమూర్తి,దానికి కుడివైపున వరాహమూర్తి.ఆ విగ్రహం కింద అమరావతి లోకనిపించే నాగకన్యల విగ్రహాలవంటి ఇద్దరు నాగకన్యలు.ఈ విగ్రహాల నడుము నుండి పైవరకు మనుష్య రూపం తలవెనక పాము పడగ, నడుము కింది భాగమంతా సర్పశరీరము కనబడతాయి. ఇందులో ఒక నాగకన్య చేతిలో తామర పద్మం ఉంది.దాని మీద వరాహమూర్తి ఎడమ పాదం ఆన్చి ఉంది. రెండవ నాగకన్య తనరెండుచేతులతో,ఆమూర్తి కుడికాలును పట్టుకున్నట్టు కనిపిస్తుంది.ఇక్కడ వరాహమూర్తి విగ్రహరూపానికీ, దక్షిణాది దేవాలయాలలో కనిపించే రూపానికీ చాలా తేడా కనిపిస్తుంది.ఈ మూర్తికి నాలుగు చేతులు ఉంటాయి.పై రెండు చేతుల్తోఈమూర్తిభూమినిగట్టిగాపట్టుకున్నట్టుఉంటుంది.మిగిలినరెండుచేతులలో,కుడిదానితోచక్రాన్నీ,ఎడమదానితో,శంఖాన్నీపట్టుకున్నట్టుకనిపిస్తుంది.వరాహమూర్తివిగ్రహంవెనకసూర్యనారాయణుడిరూపం ఉంది.ఆరూపం తలవెనక తేజోవంతమైనకాంతి పుంజం కనబడుతుంది.రెండుచేతులలో,రెండు దీపాలు ఉంటాయి.(ఎరుపు తెలుపు దీపాలనే అనుకోవాలి.)

9.సూర్యదేవుడివిగ్రహానికి,కుడిపక్కనగరుడనారాయణుడివిగ్రహంఉంది.ఈముఖమంటపంలోనే,మరోపక్కఅత్యంతమనోహరమైన,వేరెక్కడా,కనిపించనటవంటి,'సౌభాగ్యవాగీశ్వరీ'విగ్రహంకనిపిస్తుంది.దానిగురించిస్థానికులు.....ఆవిగ్రహంముందునుండీఅక్కడున్నదికాదనీ,ఊరిచివరనున్నపొలాన్నిదున్నుతున్నప్పుడుదొరికిందనీఅప్పుడుతెచ్చిఅక్కడపెట్టేరనీచెపుతారు.సుందరమైనమోముతో,మందస్మితాలైనపెదవులతో,నిమీలితాలైననేత్రాలతో,ముగ్ధమోహనంగాకనిపించేఈవాగ్దేవినిచూసినవారిమనసులు,నేత్రాలూభక్తితోనిండిపోతాయి.ఈమాతవిగ్రహంలో,కొన్నిశైవలక్షణాలూకనిపిస్తాయి.ఆమెజడశివుడిజటాజూటంలాచెక్కిఉంటుంది.దానికిఎడమవైపుచంద్రకళఉంటుంది.సుఖాసీనఅయినఆమెముందున్నరెండుచేతులతోవీణనిపలికిస్తున్నట్టుకనబడుతుంది.వెనుకవున్నఒకచేతిలోపుస్తకంకనబడుతుంది.రెండవచేతిలోకమలంకనబడుతుంది.ఈశిల్పాన్నిచెక్కినశిల్పిపనితనం,మనకిఎనలేనిఆశ్చర్యాన్నికలిగిస్తుంది.నిత్యపూజలందుకున్నకాలంలోఆదేవి,వైభోగంఎంతగొప్పగా ఉండెదోనన్న భావం మనలో కదలాడుతుంది.

*ఈపోష్టులోపేర్కొన్నశిల్పాలలోకొన్నికనబడవు..కొన్నిభక్తులుభక్తిఎక్కువైపూసినదట్టమైనపసుపుకుంకుమలవల్లరంగు,రూపాన్నికోల్పోయేయి.మహానుభావులు'మహారాజశ్రీభావరాజువేంకటక్రిష్ణారావు'గారు,సందర్శించినపుడు(సుమారునూరుసంవత్సరములకిందటిమాట)ఆయనవెల్లడించినవిషయాలనుమాత్రమే,నేనుఇక్కడతెలియజేయడంజరిగింది.వారి స్ఫూర్తికి,నామనఃపూర్వ క వందనాలు.


(మధుకేశ్వరస్వామిగురించి..మరికొన్నిఇతరఆలయాలలోనిశిల్పాలగురించీ..తర్వాత పోష్టులో..)